CM KCR TOUR | వడగండ్ల వర్షానికి పంట నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటన
23 March 2023, 17:36 IST
ఇటీవల కురిసిన వడగండ్ల వర్షం వల్ల పంటలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ క్రమంలోనే ఆ జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో పంట నష్టపోయిన తీరును పరిశీలిస్తున్నారు. రైతులకు ఏ విధంగా సాయం చేయాలనే దానిపై అధికారులతో అక్కడే చర్చిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన సాగనుంది.