తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  G20 Summit-pm Modi: చైనా అధ్యక్షుడు జిన్‍పింగ్‍తో ముచ్చటించిన ప్రధాని మోదీ

G20 Summit-PM Modi: చైనా అధ్యక్షుడు జిన్‍పింగ్‍తో ముచ్చటించిన ప్రధాని మోదీ

15 November 2022, 20:16 IST

G20 Summit - PM Narendra Modi: చైనా అధ్యక్షుడు షీ జిన్‍పింగ్‍తో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కరచాలనం చేశారు. ఇండోనేషియాలోని బాలిలో జీ20 సదస్సు జరుగుతుండగా.. మంగళవారం డిన్నర్ మీట్‍ సందర్భంగా మోదీ, జిన్‍పింగ్ చిరునవ్వుతో పలకరించుకున్నారు. కాసేపు ముచ్చటించుకున్నారు.  భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఇద్దరు నేతల కలయిక ఆసక్తికరంగా అనిపించింది. జీ20 సదస్సు సందర్భంగా మోదీ, జిన్‍పింగ్ మధ్య ముఖాముఖి చర్చ జరుగుతుందా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు. 2020 గల్వాన్ ఘటన తర్వాత మోదీ, జిన్‍పింగ్ కలవడం ఇదే తొలిసారి.