Diwali with soldiers in Kargil: యుద్ధం మొదటి ఆప్షన్ కాదన్న మోదీ
24 October 2022, 14:25 IST
- భారత దేశం ఎప్పుడూ యుద్ధాన్ని మొదటి ఆప్షన్గా చూడలేదని ప్రధాన మోదీ అన్నారు. ‘అది కురుక్షేత్ర యుద్ధం కావొచ్చు.. లంకలో యుద్ధం కావొచ్చు.. దానిని నివారించేందుకు చివరి వరకు ప్రయత్నించాం. మేం యుద్ధానికి వ్యతిరేకం. కానీ బలం లేకుండా శాంతి ఉండదు. ఎవరైనా మనవైపు చూసేందుకు ధైర్యం చేస్తే సాయుధ బలగాలు తగిన సమాధానం ఇస్తాయి..’ అని పేర్కొన్నారు. ‘దీపావళి అంటే ఉగ్రవాద ముగింపు పండగ. కార్గిల్లో మన సైన్యం తీవ్రవాద మూలాలను అణచివేసింది..’ అని అన్నారు. సైనికులతో కలిసి నేడు ఆయన కార్గిల్లో దీపావళి వేడుకల్లో పాలుపంచుకున్నారు.