“ వెల్కమ్ టు ది ఫ్యూచర్ ఆఫ్ ఇండియా”.. మహారాజాలో కొత్త అనౌన్స్మెంట్
28 January 2022, 14:58 IST
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా పూర్తిగా టాటా గ్రూప్ వశమైంది. కొత్త యాజమాన్యం మహారాజాకు ఆధునిక హంగుల్ని అద్దే ప్రయాత్నాలు మెుదలుపెట్టింది. అందులో భాగంగా ఎయిరిండియా ఫ్లైట్ ఎక్కిన ప్రయాణికులకు ఓ కొత్త అనౌన్స్మెంట్ వినపించనుంది. ‘వెల్కమ్ టు ది ఫ్యూచర్ ఆఫ్ ఇండియా.. వియ్ హోప్ యూ ఎంజాయ్ ది జర్నీ’ అంటూ వెల్కమ్ మెసేజ్తో ప్రయాణీకుల మద్దతు కొరనుంది. సంస్థ మళ్ళీ మహారాజా దర్పంతో వెలుగొందేలా టాటా గ్రూప్ ఇప్పటినుంచే ప్రయత్నాలు మెుదలుపెట్టింది.