Purvanchal Expressway BMW Accident : గంటకు 230కి.మీల వేగంతో ట్రక్ను ఢీకొట్టిన బీఎండబ్ల్యూ..
17 October 2022, 18:34 IST
- Purvanchal Expressway Car Accident : గంటకు 230కి.మీల వేగంతో ఓ బీఎండబ్ల్యూ ప్రయాణించి.. ట్రక్ను ఢీకొట్టిన ఘటన ఉత్తర్ప్రదేశ్ పూర్వాంచల్ ఎక్స్ప్రెస్పై జరిగింది. ఈ ఘటనలో కారులోని నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వాస్తవానికి ఇందులో కారులో సభ్యుల తప్పే ఉంది! కారు బిహార్ నుంచి ఢిల్లీకి వెళుతుండగా.. టాప్ స్పీడ్లో వెళ్లాలని డ్రైవర్కు లోపల కూర్చున్న వారు చెప్పారు. గంటకు 300కి.మీల వేగంతో వెళ్లాలని ప్రయత్నించారు. 'ఇంత వేగంగా వెళితే నలుగురు చచ్చిపోతాము,' అని లోపల ఓ వ్యక్తి అరిస్తుండటం వీడియోలో వినిపిచింది. కానీ డ్రైవర్ ఆగలేదు. ఈ క్రమంలోనే ఎదురుగా వస్తున్న ట్రక్ను కారు ఢీకొట్టింది.