RSS' Mohan Bhagwat: ‘మోహన్ భాగవత్ రాష్ట్ర పిత’.. ఇమాం చీఫ్ ప్రశంసలు
22 September 2022, 18:22 IST
ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ కు ఊహించని వ్యక్తి నుంచి ప్రశంసలు లభించాయి. మోహన్ భాగవత్ గురువారం ఢిల్లీలోని కేజీ మార్గ్ లో ఉన్న మసీదుకు వెళ్లారు. అక్కడ ఆల్ ఇండియా ఇమాం ఆర్గనైజేషన్ చీఫ్ ఉమర్ అహ్మద్ ఇల్యాసి తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విబేధాలను పరిష్కరించుకుని, దేశాన్ని బలోపేతం చేయడం కోసం అందరూ కలిసి పని చేయాలని ఇరువురు నిర్ణయించారు. ఈ సందర్భంగా.. ‘రాష్ట్ర పిత’ అంటూ మోహన్ భాగవత్ ను ఉమర్ అహ్మద్ ఇల్యాసి ప్రశంసించారు. ‘భారతీయులందరి డీఎన్ఏ ఒక్కటే. దేవుడిని ప్రార్థించే విధానాలు మాత్రమే వేరువేరు’ అని ఇల్యాసీ వ్యాఖ్యానించారు. పూర్తి వ్యాఖ్యలు, మోహన్ భాగవత్ ప్రసంగం ఈ వీడియోలో చూడండి..