Bank robbery | నాలుగే నిమిషాల్లో బ్యాంక్ను దోచేశారు..
12 August 2022, 21:05 IST
Bank robbery | ఐదుగురు వ్యక్తులు ముఖానికి మాస్క్లు పెట్టుకుని బ్యాంక్ లోపలికి వచ్చారు. ఆ సమయంలో కస్టమర్లెవరూ లేరు. ఆ ఐదుగురిలో ఇద్దరి వద్ద తుపాకులు, ఒకరి వద్ద పెద్ద కత్తి ఉన్నాయి. అవి చూపుతూ ఉద్యోగులను బెదరించారు. ఉద్యోగుల నుంచి మొబైల్ ఫోన్లను లాక్కున్నారు. క్యాషియర్ కేబిన్లోనికి వెళ్లి, కేషియర్ను బెదిరించి కౌంటర్లోని రూ. 13 లక్షలు తీసుకున్నారు. క్షణాల్లో తాము వచ్చిన రెండు బైక్లపై పరారయ్యారు. ఇదంతా కేవలం నాలుగు నిమిషాల్లోనే జరిగింది. పంజాబ్లోని లూథియానాలో ఉన్న పీఎన్బీ బ్యాంక్ బ్రాంచ్లో గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.