Maharashtra politics : ‘నా అనుకున్న వాళ్లే వెన్నుపోటు పొడిచారు’
25 June 2022, 9:57 IST
Maharashtra politics : శివసేనను అంతం చేసేందుకు.. బీజేపీ, ఏక్నాథ్ షిండే ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు ఆ పార్టీ అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే. ధైర్యం ఉంటే.. తన నుంచి శివసేనను, శివ సైనికులను వేరుచేయాలని సవాలు విసిరారు. పార్టీసభ్యులతో వర్చువల్గా సమావేశమైన ఉద్ధవ్ ఠాక్రే.. ‘నా అనుకున్న వాళ్లే శివసేనను.. వెన్నుపోటు పొడిచారు,’ అని ఆవేదన వ్యక్తం చేశారు. శివసైనికులే తన సంపద అని స్పష్టం చేశారు.