మేఘాలయ ముఖ్యమంత్రిగా ఎన్పీపీ చీఫ్ కాన్రాడ్ సంగ్మా ప్రమాణస్వీకారం
07 March 2023, 16:17 IST
- మేఘాలయ కొత్త ముఖ్యమంత్రిగా ఎన్పీపీ చీఫ్ కాన్రాడ్ సంగ్మా ప్రమాణస్వీకారం చేశారు. షిల్లాంగ్లోని రాజ్భవన్లో ఇవాళ జరిగిన కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి జేపీ నడ్డా తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఎన్సీపీ చీఫ్ కాన్రాడ్ సంగ్మా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం వరుసగా ఇది రెండోసారి. ఇటీవల జరిగిన మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్పీపీ కూటమి 45 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటుకు ముందుగు వచ్చింది. కాన్రాడ్ కె సంగ్మా సారథ్యంలోని ఎన్పీపీ 26 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 2 సీట్లు గెలుచుకుంది.