తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  మసీదులపై హిందూ సంస్థల వ్యాఖ్యలు వ్యతిరేకించిన ఆర్ఎస్ఎస్ చీఫ్

మసీదులపై హిందూ సంస్థల వ్యాఖ్యలు వ్యతిరేకించిన ఆర్ఎస్ఎస్ చీఫ్

03 June 2022, 9:48 IST

మందిర్-మసీదు చర్చపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ మౌనం వీడారు. జ్ఞానవాపి మసీదు - కాశీ విశ్వనాథ ఆలయ వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. ఇరువర్గాలూ కూర్చుని పరిష్కారం కనుగొనాలని భగవత్ సూచించారు. కోర్టు తీర్పు వెలువడినప్పుడు ఎలాంటి ఆందోళనలు ఉండవని ఆర్ఎస్ఎస్ చీఫ్ ఉద్ఘాటించారు. గుడి-మసీదు చర్చపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడటం ఇదే తొలిసారి. మతపరమైన స్థలాలపై తాజా వివాదాలను లేవనెత్తకుండా హిందూ గ్రూపులను మోహన్ భగవత్ హెచ్చరించారు. మరిన్ని వివరాల కోసం పూర్తి వీడియోను చూడండి.