BJP vs TMC: మిథున్ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు - మెంటల్ ఏమో అంటూ టీఎంసీ కౌంటర్
28 July 2022, 7:48 IST
Mithun Chakraborty vs TMC: పశ్చిమబెంగాల్ బీజేపీ నేత మిథున్ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమతో 38 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు టచ్ లు ఉన్నారని ... బెంగాల్లో కూడా మహారాష్ట్ర పరిస్థితి రావొచ్చని కామెంట్స్ చేశారు. దీనిపై స్పందించిన టీఎంసీ... గట్టి కౌంటర్ ఇచ్చింది. ఆయనకు బహుశా మెంటల్ అయి ఉండవచ్చని ఫైర్ అయింది. ఈ మేరకు టీఎంసీ ఎంపీ శాంతను సేన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ... తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'మిథున్ చక్రవర్తికి బహుశా శారీరక సమస్య కాదు మానసిక సమస్య అయి ఉంటుంది. ఆయన చెప్పే మాటలను బెంగాల్లో ఏ ఒక్కరూ పట్టించుకోరు. ఆయనకు రాజకీయాల గురించి ఏం తెలియదు. అదే సమస్య' అంటూ సెటైర్లు విసిరారు. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి….