karnataka assembly election | కన్నడనాట కొనసాగుతోన్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
10 May 2023, 11:14 IST
- కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ప్రముఖులు ఉదయాన్నే తమ ఓటు హక్కును ఆయా స్థానిక పోలింగ్ కేంద్రాల్లో వినియోగించుకున్నారు. మొత్తం 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీకి ఒకే దశలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 2,613 అభ్యర్థులు పోటీలో నిలవగా, 5.3 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.