J&K encounter: కశ్మీర్లో మరో ఎన్ కౌంటర్
07 September 2022, 23:01 IST
J&K encounter: కశ్మీర్లో జరిగిన మరో ఎన్ కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అల్ కాయిదా అనుబంధ సంస్థ అయిన Ansar Ghazwat-ul-Hind ఉగ్ర సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు బుధవారం కశ్మీర్లోని అనంత్ నాగ్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్లో చనిపోయారు. ఇదే జిల్లాలో గత 24 గంటల్లో నలుగురు ఉగ్రవాదులు హతమవ్వడం విశేషం. కాగా, బుధవారం హతమైన ఉగ్రవాదులు గతంలో కశ్మీర్ లోయలో పలు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డారు. అయితే, వీరి సంస్థ Ansar Ghazwat-ul-Hind అనేది పాక్ వ్యతిరేక సంస్థ కావడం గమనార్హం. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి..