Two blasts rock Udhampur ahead of Amit Shah's visit: కశ్మీర్లో బాంబు పేలుళ్లు
29 September 2022, 18:05 IST
జమ్మూకశ్మీర్లో రెండు బాంబు పేలుళ్లు జరిగాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనకు కేవలం ఒక్క రోజు ముందు ఈ పేలుళ్లు జరగడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో అమిత్ షా పర్యటన వాయిదా పడినట్లు సమాచారం. ఉధంపూర్ లోని ఒక పెట్రోల్ బంక్ సమీపంలో పార్క్ చేసి ఉన్న ఒక బస్సులో బుధవారం రాత్రి తొలి పేలుడు జరిగింది. బస్సులు పార్క్ చేసే ప్రాంతంలోని ఒక బస్సులో గురువారం ఉదయం మరో పేలుడు సంభవించింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో ఆ బస్సుల్లో ఎవరూ లేరు. కేసు దర్యాప్తును ఎన్ఐఏ చేపట్టింది. పూర్తి వివరాలు ఈ వీడియోలో..