ఇండిగో సిబ్బంది ఓవరాక్షన్.. రూ. 5 లక్షల ఫైన్ విధించిన డీజీసీఏ
29 May 2022, 6:37 IST
ఇండిగో సంస్థపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కొరడా ఝుళిపించింది. ఓ దివ్యాంగ బాలుడిని విమానంలోకి రానివ్వని ఘటనలో రూ. 5 లక్షల ఫైన్ విధించింది. మే 7న దివ్యాంగ బాలుడితో కలిసి ఓ కుటుంబం రాంచీ విమానాశ్రయానికి వచ్చింది. అయితే.. ఆ బాలుడు విమానం ఎక్కేందుకు ఇండిగో సంస్థ సిబ్బంది నిరాకరించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను తోటి ప్రయాణికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో వైరల్ గా మారాయి. విచారణ జరిపిన డీజీసీఏ చర్యలు తీసుకుంది. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి.