కథ సుఖాంతం.. అరుణాచల్ యువకుడిని అప్పగించిన చైనా!
28 January 2022, 12:35 IST
అరుణాచల్ ప్రదేశ్కు చెందిన 17 ఏళ్ల మిరాన్ తరోన్ అదృశ్యంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్లయింది. చైనా బలగాలు ఆ యువకుడిని భారత సైన్యానికి అప్పగించాయి. చైనాతో హాట్లైన్ ద్వారా చర్చలు జరిపిన భారత రక్షణశాఖ అతణ్ని సురక్షితంగా స్వదేశానికి రప్పించింది. వాచా-దమై ఇంటరాక్షన్ పాయింట్ వద్ద మిరాన్ను భారత్కు చైనా అప్పగించినట్లు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్లో తెలిపారు. ఈ నెల 18న మిరాన్ తరోన్ సంగ్పో నది సమీపంలో అదృశ్యమైన మిరాన్ను చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కిడ్నాప్ చేసినట్లు పెద్దఎత్తున దుమారం రేగింది. ఈ నేపథ్యంలో చైనా పీఎల్ఏతో హాట్ లైన్ కమ్యూనికేషన్ ద్వారా సంప్రదింపులు జరిపిన భారత రక్షణ శాఖ.. మిరాన్ తరోన్ను సురక్షితంగా వెనక్కి రప్పించగలిగింది.