కొవిడ్ ఇచ్చిన 'సంపద'.. ప్రతి 30గంటలకు ఓ బిలియనీర్ ఆవిర్భావం!
23 May 2022, 19:56 IST
ప్రపంచంలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నట్టు ఓ నివేదిక బయటకొచ్చింది. హక్కుల సంస్థ ఆక్స్ఫామ్ ప్రకారం.. కరొనా మహమ్మారి కాలంలో.. ప్రతి 30 గంటలకు ఓ కొత్త బిలియనీర్ పుట్టుకొచ్చినట్టు తెలిపింది. కాగా.. ప్రస్తుత పరిస్థితుల్లో.. 30 గంటలకు ఒకరు కఠిన పేదరికంలోకి జారుకునే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఆహార, ఎనర్జీ రంగానికి చెందిన వ్యాపారులు.. ప్రతి రెండు రోజులకోసారి 1 బిలియన్ డాలర్లను వెనకేసుకున్నట్టు నివేదిక తెలిపింది. దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫారంలో ఈ నివేదికను ప్రదర్శించారు.