US -China | యూఎస్- చైనా: సిట్యుయేషన్ సీరియస్
02 August 2022, 21:53 IST
US -China | అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలొసీ తైవాన్లో పర్యటించడాన్ని చైనా సీరియస్గా తీసుకుంది. తమ స్పష్టమైన హెచ్చరికలను కూడా బేఖాతరు చేస్తూ ఆమె తైవాన్ గడ్డపై అడుగుపెట్టడంపై మండి పడ్తోంది. తైవాన్ పై సైబర్ దాడులకు పాల్పడడంతో పాటు, తైవాన్వైపు యుద్ధ విమానాలను పంపించింది. చైనా యుద్ధ విమానాలు తైవాన్ జల సంధిని దాటి తైవాన్ వైపు చక్కర్లు కొట్టాయి. మరోవైపు, తైవాన్కు దగ్గరలో అమెరికా నాలుగు యుద్ధ నౌకలను మోహరించింది. తన పర్యటన తైవాన్లో ప్రజాస్వామ్యానికి అమెరికా ఇస్తున్న మద్దతుకు ప్రతీక అని నాన్సీ పెలోసీ ట్వీట్ చేశారు.