తెలుగు న్యూస్  /  Video Gallery  /  Boris Johnson Tries The Charkha After Touchdown In Gujarat; Meet With Pm Modi Tomorrow

Video: సబర్మతి ఆశ్రమానికి బ్రిటన్ ప్రధాని.. నూలు చరఖా తిప్పిన బోరిస్

21 April 2022, 13:39 IST

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇవాళ భారత్ కు చేరుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా వచ్చిన ఆయన... గుజరాత్‌లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. ప్రధాని బోరిస్ కు ఆ రాష్ట్ర గవర్నర్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌, సీఎం భూపేంద్ర పటేల్ స్వాగతం పలికారు. సబర్మతి ఆశ్రమంలోని చరఖా తిప్పారు బోరిస్ జాన్సన్. ఆశ్రమానికి రావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచం మార్చేందుకు సత్యం, అహింస అనే సున్నితమైన సూత్రాలను ఏ విధంగా విస్తరించారో తెలుకోవటం తనకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు.  అంతకుముందు గుజరాతీ సంప్రాదాయ నృత్యాలతో బోరిస్ కు ఘన స్వాగతం పలికారు. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి.