Bangaluru Viral Video | మహిళా ప్యాసింజర్ పై దురుసు ప్రవర్తన, టీసీ సస్పెండ్
16 March 2023, 15:32 IST
- కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని కృష్ణరాజపురం రైల్వే స్టేషన్లో మహిళా ప్రయాణికురాలికి, టీటీకి మధ్య గొడవ జరిగింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టికెట్ కలెక్టర్ ఆ మహిళపై గట్టిగా అరిచారు. ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. చుట్టూ ఉన్న వాళ్లంతా వారిస్తున్నా టీటీ తన వైఖరి మార్చుకోలేదు. టికెట్ బుక్ చేసుకున్నానని చెబుతున్నా వినకుండా ఆ అధికారి కావాలనే వేధించాడని బాధితురాలు ఆరోపించారు. నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నారు. నేను టికెట్ బుక్ చేసుకునే ఇక్కడి వరకూ వచ్చానని ఆ మహిళ చెబుతున్నారు. ఆమె ఒంటరిగా ప్రయాణిస్తోంది. అందుకే కావాలని టీటీ ఆమెను వేధిస్తున్నాడు. ఆమె ఎవరో నాకు తెలియదు. కానీ టీటీ చేసేది మాత్రం సరికాదని ఓ ప్రయాణికుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. మద్యం మత్తులో ఇలా ప్రవర్తించాడని ఆరోపించారు. అయితే ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న అధికారులు వెంటనే ఆ టీటీని సస్పెండ్ చేశారు.