అగ్నిపథ్తో షింజో అబే హత్యకు లింక్ - టీఎంసీ పై బీజేపీ ఫైర్
10 July 2022, 9:32 IST
Jago Bangla news on japan ex pm killing: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్యకు.. ఆర్మీ రిక్రూట్మెంట్ పథకం అగ్నిపథ్కు ముడిపెడుతూ ప్రచురితమైన ఓ కథనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. టెత్సుయ యమగామి అనే వ్యక్తి జపాన్ నావికా దళంలో 3 ఏళ్ల పాటు పని చేశాడని... ఆ తర్వాత ఉద్యోగం లేకుండా.. పెన్షన్ రాకుండా ఇబ్బంది పడ్డాడని పేర్కొంది. ఆ కోపంతోనే షింజోను కాల్చి చంపేశాడు అంటూ ప్రచురించింది. ఈ వార్తను టీఎంసీ(Trinamool Congress ) అధికార పత్రిక ‘జాగో బంగ్లా’ ఫ్రంట్పేజీ కథనంగా ప్రచురించింది. ఈ వార్తపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై తీవ్ర విమర్శలు చేసింది. మాజీ ప్రధాని హత్యపై చిల్లర రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టింది. ఆమెను దేశ వ్యతిరేకంగా అభివర్ణించింది. పూర్తి కథనం కోసం వీడియోను చూడండి…..