తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  చాలా మంది ఆఫ్తాబ్‍లు ఉన్నారు.. లవ్ జిహాద్‍కు వ్యతిరేకంగా చట్టం తేవాలి: అసోం సీఎం

చాలా మంది ఆఫ్తాబ్‍లు ఉన్నారు.. లవ్ జిహాద్‍కు వ్యతిరేకంగా చట్టం తేవాలి: అసోం సీఎం

23 November 2022, 13:57 IST

Assam CM Himanta Biswa Sarma: గుజరాత్ ఎన్నికల ప్రచారంలో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్య కేసును ప్రస్తావించారు. లవ్ జిహాద్‍కు వ్యతిరేకంగా కఠినమైన చట్టం తీసుకురావాలని మరోసారి అన్నారు. శ్రద్ధా హత్య కేసు లాంటివి భారత్‍లో చాలా జరుగుతున్నాయని శర్మ అభిప్రాయపడ్డారు. చాలా మంది ఆఫ్తాబ్‍లు ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. శ్రద్ధా వాకర్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రియుడు ఆఫ్తాబ్ పునావాలా.. శ్రద్ధను చంపి 35 ముక్కలుగా నరికాడు. ఈ విషయాన్ని కోర్టులోనూ అంగీకరించాడు. ఈ విషయంపై అసోం సీఎం ఏమన్నారో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.