తెలుగు న్యూస్  /  Video Gallery  /  Jaishankar Hits Out At Pakistan China Over Terrorism

Minister S Jaishankar: పాక్, చైనాపై విరుచుకుపడ్డ జైశంకర్!

20 November 2022, 17:38 IST

  • పాకిస్థాన్, చైనా దేశాలపై భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ మరోసారి విరుచుకుపడ్డారు. పేర్లు నేరుగా ప్రస్తావించకున్నా.. ఆ దేశాలకు సూటిగా తగిలేలా వ్యాఖ్యలు చేశారు.  ఉగ్రవాదానికి కొన్ని దేశాలు మద్దతిస్తూనే ఉన్నాయని, దాన్ని వారి పాలనా విధానంగా మార్చుకున్నాయని విమర్శించారు. ఉగ్రవాదానికి స్వర్గంగా ఉన్న వాటిపై కఠిన చర్యలు ఉండాలని స్పష్టం చేశారు.  ఉగ్రవాదంపై పోరులో ఎలాంటి బేధాలు, ఉదాసీనత ఉండకూడదని జైశంకర్ అన్నారు. ఏ రాజకీయ కారణం కూడా ఉగ్రవాదాన్ని సమర్థించలేదని జైశంకర్ అన్నారు. ఆయన చేసిన మరిన్ని వ్యాఖ్యలు ఈ వీడియో చూడండి.