భారత ఆర్మీ చీఫ్ను ప్రశంసించిన పాక్ సెనేటర్.. ఆ తర్వాత అరెస్ట్.. ఏం జరిగిందంటే..
27 November 2022, 20:25 IST
పాకిస్థాన్ తహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (Pakistan Tehreek-e-Insaf) పార్టీకి చెందిన సెనేటర్, పాకిస్థాన్ మాజీ మంత్రి ఆజమ్ స్వతీ(Azam Swati).. భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండేను బహిరంగంగా ప్రశంసించారు. రూ.కోట్ల రూపాయలను కూడబెట్టుకున్నారంటూ పాక్ ఆర్మీ చీఫ్ ఖమర్ బాజ్వాను ఆయన విమర్శించారు. ఇమ్రాన్ ఖాన్ సమక్షంలోనే భారత ఆర్మీ చీఫ్ను ఆజమ్ పొగిడారు. అయితే తమ దేశ ఆర్మీ హెడ్ బాజ్వాను విమర్శించినందుకు, అభ్యంతరకర ట్వీట్లు చేశారన్న ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు ఆజమ్. మరిన్ని వివరాలు కోసం ఈ వీడియో చూడండి.