విజయవాడలో సందడి చేసిన బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్
09 March 2023, 16:31 IST
- లోకులు కాకులై కూస్తారు.. నేను ఎవ్వరినీ పట్టించుకోనని మీకు తెలుసు అని నటసింహం నందమూరి బాలకృష్ణ అన్నారు. విజయవాడలో ఓ జ్యుయెలరీ షోరూం ప్రారంభోత్సవంలో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్తో కలిసి బాలయ్య పాల్గొన్నారు. ఈ జ్యుయెలరీ బ్రాండ్కు బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. బాలకృష్ణ ఏంటి ఒక జ్యుయెలరీ షాప్ ఓపెనింగ్కు రావడం ఏంటి అని అంటారు.. లోకులు కాకులై కూస్తారు. ఎవడినీ పట్టించుకోనని మీకు తెలుసు. ముందు తెలుగువాళ్లం మనం. ఎవరి ఏం సాధించినా వాళ్లను ప్రోత్సహించడానికి నేను ముందుంటానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా అని బాలకృష్ణ అన్నారు.