తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Kadapa | సునీత వెనుక నేనున్నా.. జగనన్నకు వైఎస్ షర్మిల వార్నింగ్..!

Kadapa | సునీత వెనుక నేనున్నా.. జగనన్నకు వైఎస్ షర్మిల వార్నింగ్..!

15 March 2024, 16:00 IST

  • కడపలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఐదవ వర్ధంత్రి కార్యక్రమం జరిగింది. ఇందులో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు. వివేకాను అత్యంత కిరాతకంగా నరికి చంపిన హంతకులకు అన్ననే అండగా ఉన్నారని వైఎస్ షర్మిల తీవ్ర ఆరోపణలు గుప్పించారు. హత్య చేసిన వారికి ఇంకెక్కడ శిక్షపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ సునీతా రెడ్డి వెనుక తాను అండగా ఉంటానని షర్మిల హామీ ఇచ్చారు. ఇది ఆస్తి కోసం, అంతస్తు కోసం జరిగే పోరాటం కాదని..న్యాయం కోసం జరుగుతున్న పోరాటమని షర్మిల స్పష్టం చేశారు.