తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  లోకేశ్ యువగళం పాదయాత్రలో ప్రత్యక్షమైన వంగవీటి రాధా

లోకేశ్ యువగళం పాదయాత్రలో ప్రత్యక్షమైన వంగవీటి రాధా

07 March 2023, 18:09 IST

  • టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర పీలేరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. మంగళవారం ఉదయం కలికిరి ఇందిరమ్మనగర్ విడిది కేంద్రం నుంచి 37వ రోజు యువగళం పాదయాత్రను లోకేష్ ప్రారంభించారు. కలికిరి వద్ద లోకేష్ యువగళం పాదయాత్రకు విజయవాడ టీడీపీ నేత వంగవీటి రాధా సంఘీభావం తెలిపారు. లోకేష్‌ తో పాటు వంగవీటి రాధా పాదయాత్ర చేశారు. అయితే టీడీపీ నేతగా ఉన్న వంగవీటి రాధా ఆ పార్టీని వీడుతారనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. గత ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన రాధా.. ఆ పార్టీ తరపున పోటీ చేయకుండా ప్రచారానికే పరిమితం అయ్యారు. ఈ నాలుగేళ్లలో కూడా రాధా ఏ నియోజవర్గంపైనా కూడా దృష్టి పెట్టలేదు. ఈసారి మాత్రం టీడీపీని వీడి జనసేనలో చేరుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక లోకేశ్ పాదయాత్రలో పాల్గొనటంతో ఆ ప్రచారానికి బ్రేక్ పడింది.