తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Kurnool District | పులి పిల్లలను చూసి హడలిపోయిన జనం

kurnool District | పులి పిల్లలను చూసి హడలిపోయిన జనం

06 March 2023, 20:53 IST

  • ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో పులుల భయం పెరిగిపోయింది. పులులు గ్రామాల్లో సంచరిస్తుండటంతో జనం హడలిపోతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా నల్లమల అడవి ప్రాంతం సమీపంలోని గ్రామాల్లో నివసించే ప్రజలకు పెద్ద పులుల సంచారం కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. తాజాగా నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురం గ్రామ సమీపంలోని నాలుగు పెద్దపులి పిల్లలు కలకలం రేపాయి. వెంటనే గ్రామస్తులు ఆ నాలుగు పెద్ద పులి పిల్లలను కుక్కలు దాడి చేసి గాయపరచకుండా గ్రామంలోని ఓ గదిలో భద్రపరిచి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. లభ్యమైన పెద్ద పులి పిల్లల లభ్యం ఘటనపై అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. తల్లి పులి కూడా ఇక్కడే సంచరిస్తూ ఉంటుందని పిల్లలను తల్లి దగ్గరికి చేర్చే వరకు నిఘా ఉంచుతామని ఆయన అన్నారు.