తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Sajjala On 3 Capitals: ఎలాంటి కన్ఫ్యూజన్‌ లేదు.. మా నిర్ణయం అదే

Sajjala On 3 Capitals: ఎలాంటి కన్ఫ్యూజన్‌ లేదు.. మా నిర్ణయం అదే

15 February 2023, 17:14 IST

  • sajjala ramakrishna reddy on three capitals issue: మూడు రాజధానులపై తమకు ఎటువంటి కన్ఫ్యూజన్‌ లేదన్నారు ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి. కన్ఫ్యూజన్‌ సృష్టిస్తున్నది ఎల్లో మీడియానే అనే దుయ్యబట్టారు. మూడు రాజధానులకే తాము కట్టుబడి ఉన్నామని... మంత్రి బుగ్గన చెప్పింది కూడా అదే అన్నారు. బుగ్గన మాటలను ఎల్లో మీడియా వక్రీకరించిందని... వికేంద్రీకరణకు ప్రజల్లో పెద్ద ఎత్తున మద్దతు ఉందని స్పష్టం చేశారు. రాజధాని పేరుతో రాజకీయం చేస్తుంది టీడీపీ, ఎల్లో మీడియానే అన్న ఆయన... విశాఖలో పరిపాలనా రాజధాని, పరిశ్రమలు వస్తే వీళ్ళకు కడుపుమంట ఎందుకు? అని ప్రశ్నించారు. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్‌ అని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లోనూ అధికార వికేంద్రీకరణ నినాదంతోనే వెళ్తామని స్పష్టం చేశారు. . అసెంబ్లీ అమరావతిలోనే ఉంటుందని..హైకోర్టు, న్యాయ సముదాయాలు కర్నూలులో ఉంటాయని చెప్పారు. వాటిని క్యాపిటల్‌ అనేది మేమిచ్చుకున్న నిర్వచనం...ఇందులో వైరుధ్యం ఏమీ లేదన్నారు. సుప్రీంలో తాము వాదించేది కూడా అదే అన్న సజ్జల... ఇంకా అందరి సూచనలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వికేంద్రీకరణకు చట్టరూపం ఇవ్వాల్సి వచ్చినప్పుడు కూడా మా విధానంలో మార్పు ఉండదన్నారు. అందులో భాగంగా ప్రధాన వ్యవస్థలను మూడు ప్రాంతాల్లో పెట్టడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు.