తెలుగు న్యూస్  /  Video Gallery  /  Sajjala Ramakrishna Reddy Key Comments On Three Capitals Issue

Sajjala On Three Capitals: పకడ్బందీ చట్టం తెస్తాం.. 3 రాజధానులపై సజ్జల క్లారిటీ

30 November 2022, 13:35 IST

  • Sajjala Ramakrishna Reddy On 3 Capitals: మూడు రాజధానుల అంశంపై ఏపీ ప్రభుత్వ సలహాదారుడు, వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక సరైన పద్ధతి ప్రకారం, లోతైన, మరింత పకడ్బందీగా 3 రాజధానుల చట్టాన్ని తీసుకొస్తామని స్పష్టం చేశారు. 3 ప్రాంతాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, వికేంద్రీకరణను న్యాయ ప్రక్రియకు, రాజ్యాంగానికి లోబడి ఎలా చేయాలో అదే తరహాలోనే ప్రభుత్వం పూర్తి చేస్తుందన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన... కర్నూలులో హైకోర్టు వద్దని సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేదని తెలిపారు. 3 రాజధానుల విషయంలో మా ఉద్దేశం స్పష్టంగా ఉందన్నారు. అమరావతి కోసం రైతులు భూములిచ్చింది వాస్తవం. వారికి న్యాయం చేస్తామని చెప్పుకొచ్చారు.