Minister Roja | వైశ్రాయ్ హోటల్ నుంచి ఇప్పటి వరకు వెన్నుపోటు రాజకీయాలే
24 March 2023, 14:36 IST
ఎమ్మెల్యే స్థానాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పడటంపై మంత్రి రోజా ఘాటుగా స్పందించారు. క్రాస్ ఓటింగ్ చేసిన వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో మీరే చూస్తారని మీడియోను ఉద్దేశించి రోజా అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలంతా జగన్ చరిష్మాతో గెలిచారని స్పష్టం చేశారు. నీతిమాలిన రాజీకీయాలు చేసే వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి రెండు సీట్లు కూడా రావన్నారు రోజా.