Jagan comments on capital | మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
14 March 2023, 19:26 IST
- అసెంబ్లీ బడ్జెట్ సమాశాల నేపథ్యంలో సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ భేటీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూలైలో విశాఖకి వెళ్తున్నామని మంత్రుల వద్ద అన్నట్లు తెలిసింది. దీంతో అక్కడి నుంచి ప్రభుత్వ పాలనకు దాదాపుగా ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది. విశాఖ పాలనా రాజధాని అని గతంలో సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేశారు. తాను విశాఖకు మారుతున్నానని ఢిల్లీలో కూడా ఆయన ప్రకటించారు.