CM YS Jagan: అమరావతిలోనే రాజధానిని పెట్టేందుకు సిద్ధమయ్యా.. అసెంబ్లీలో సీఎం జగన్
16 September 2022, 13:40 IST
- cm jagan on 3 capitals: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ కీలక ప్రసంగం చేశారు. అమరావతి ప్రాంతం అంటే తనకు ద్వేషం లేదని... రాజధానిగా కూడా తీసివేయాలని చెప్పలేదని క్లారిటీ ఇచ్చారు. కొత్తగా కర్నూలు, విశాఖలో కూడా రాజధానులు ఉంటాయని మాత్రమే చెప్పామని స్పష్టం చేశారు. రైతుల పేరుతో చంద్రబాబు కృతిమ ఉద్యమాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా మూడు రాజధానుల అవశ్యకతను ముఖ్యమంత్రి వివరించారు. వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.