తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Scr Special Trains: అలర్ట్.. తిరుపతితో పాటు ఈ ప్రాంతాలకు స్పెషల్ ట్రైన్స్ - టైమింగ్స్ ఇవే

SCR Special Trains: అలర్ట్.. తిరుపతితో పాటు ఈ ప్రాంతాలకు స్పెషల్ ట్రైన్స్ - టైమింగ్స్ ఇవే

25 May 2023, 5:57 IST

    • South Central Railway Special Trains: వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. తిరుపతితో పాటు పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. వాటి వివరాలు చూస్తే….
కాచిగూడ నుంచి ప్రత్యేక రైళ్లు
కాచిగూడ నుంచి ప్రత్యేక రైళ్లు

కాచిగూడ నుంచి ప్రత్యేక రైళ్లు

South Central Railway Special Trains Latest: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా... తాజాగా పలు రూట్లలో కొత్త సర్వీసులను నడపనుంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా కాచిగూడ - తిరుపతి, తిరుపతి - కాచిగూడ, కాచిగూడ - కాకినాడ టౌన్, కాకినాడ టౌన్ - కాచిగూడ మధ్య స్పెషల్ ట్రైన్స్ నడపనుంది.

ట్రెండింగ్ వార్తలు

Leopard in Medak : మెదక్ జిల్లాలో చిరుత సంచారం...! అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు

TS TET Exams 2024 : తెలంగాణ టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల - స్వల్ప మార్పులు, ఏ పరీక్ష ఎప్పుడంటే..?

Goa Tour Package : బడ్జెట్ ధరలోనే 4 రోజుల గోవా ట్రిప్... ఎన్నో బీచ్‌లు, క్రూజ్ బోట్ లో జర్నీ - ప్యాకేజీ వివరాలివే

TSRTC Ticket Reservation : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ - రిజర్వేషన్ ఛార్జీల మినహాయింపుపై ప్రకటన

కాచిగూడ-తిరుపతి(ట్రైన్ నెం -07061) స్పెషల్ ట్రైన్ ను ప్రకటించారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. మే 25వ తేదీన ఈ స్పెషల్ ట్రైన్ రాత్రి 10.10 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. ఇక తిరుపతి-కాచిగూడ( ట్రైన్ నెం- 07062 ) ట్రైన్ ను ఈ నెల 26వ తేదీన నడపనున్నట్లు దక్షణ మధ్య రైల్వే తెలిపింది. ఈ ప్రత్యేక రైలు మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 4 గంటలకు కాచిగూడకు చేరుతుంది. ఈ ప్రత్యేక రైళ్లు షాద్ నగర్, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.

ఇక కాచిగూడ-కాకినాడ టౌన్(ట్రైన్ - 07417 ) మధ్య కూడా ప్రత్యేక రైళ్లను ప్రకటించారు అధికారులు. ఈ ప్రత్యేక రైలు మే 27వ తేదీన రాత్రి 8:45 గంటలకు కాచిగూడ నుంచి బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 08:45 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. ఇక కాకినాడ టౌన్(ట్రైన్ నెంబర్ 07418) నుంచి కూడా ఈ నెల 28న ప్రత్యేక రైలును నడపనున్నారు. ఈ ట్రైన్ కాకినాడ నుంచి 09.55 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 09:45 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. ఈ స్పెషల్ ట్రైన్స్... కాచిగూడ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సమార్లకోట స్టేషన్లలో ఆగుతాయని అధికారులు ప్రకటించారు. ఈ సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని ఓ ప్రకటనలో కోరారు. ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ - 2 టైర్, ఏసీ - 3 టైర్, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయి.