తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ttd Temple: చెన్నైలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం.. వైభవంగా 'మహాకుంభాభిషేకం'

TTD Temple: చెన్నైలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం.. వైభవంగా 'మహాకుంభాభిషేకం'

18 March 2023, 12:37 IST

TTD temple inaugurated in Chennai: చెన్నైలో నూతనంగా నిర్మించిన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం శాస్త్రోక్తంగా మహాకుంభాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో పాటు విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానంద స్వామి పాల్గొన్నారు.

  • TTD temple inaugurated in Chennai: చెన్నైలో నూతనంగా నిర్మించిన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం శాస్త్రోక్తంగా మహాకుంభాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో పాటు విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానంద స్వామి పాల్గొన్నారు.
శుక్రవారం ఉదయం 4 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విశ్వక్సేనారాధన, చతుష్టార్చన, బలిహరణ, గోష్టి, బ్రహ్మఘోష, వేదశాత్తుమొర, మహా పూర్ణాహుతి, ప్రాయశ్చిత్త హోమాలు, శాంతిహోమాలు, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు.  
(1 / 4)
శుక్రవారం ఉదయం 4 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విశ్వక్సేనారాధన, చతుష్టార్చన, బలిహరణ, గోష్టి, బ్రహ్మఘోష, వేదశాత్తుమొర, మహా పూర్ణాహుతి, ప్రాయశ్చిత్త హోమాలు, శాంతిహోమాలు, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు.  (twitter)
కుంభ ప్రోక్షణ, విమాన, రాజగోపురానికి కుంభ ప్రోక్షణ, ప్రాణ ప్రతిష్ట, హారతి కార్యక్రమాల తర్వాత శ్రీ పద్మావతి శ్రీనివాసుల కల్యాణం వైభవంగా జరిగింది. ఈ వేడుకలో భక్తులు భారీగా పాల్గొన్నారు.  
(2 / 4)
కుంభ ప్రోక్షణ, విమాన, రాజగోపురానికి కుంభ ప్రోక్షణ, ప్రాణ ప్రతిష్ట, హారతి కార్యక్రమాల తర్వాత శ్రీ పద్మావతి శ్రీనివాసుల కల్యాణం వైభవంగా జరిగింది. ఈ వేడుకలో భక్తులు భారీగా పాల్గొన్నారు.  (twitter)
ఈ మహా కుంభాభిషేకంలో  విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానంద స్వామి పాల్గొన్నారు.  మహా కుంభాభిషేకం నిర్వహణ పట్ల టీటీడీని అభినందించారు.
(3 / 4)
ఈ మహా కుంభాభిషేకంలో  విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానంద స్వామి పాల్గొన్నారు.  మహా కుంభాభిషేకం నిర్వహణ పట్ల టీటీడీని అభినందించారు.(twitter)
చెన్నయ్ టీ నగర్‌లో టీటీడీ నిర్మించిన ఈ పద్మావతి అమ్మవారి ఆలయానికి సినీ నటి కాంచన.. స్థలాన్ని విరాళంగా  ఇచ్చారు. దీని విలువ సుమారు రూ. 40కోట్ల వరకు ఉంటుంది. ఇక  రూ.10 కోట్లతో టీటీడీ ఈ ఆలయ నిర్మాణం చేపట్టింది.  చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షులు శేఖర్ రెడ్డి, సభ్యులు స్మిత ఇతర సభ్యుల ఆధ్వర్యంలో రూ.5 కోట్లతో గాలిగోపురం, కలశాలు ఏర్పాటు చేశారు. 
(4 / 4)
చెన్నయ్ టీ నగర్‌లో టీటీడీ నిర్మించిన ఈ పద్మావతి అమ్మవారి ఆలయానికి సినీ నటి కాంచన.. స్థలాన్ని విరాళంగా  ఇచ్చారు. దీని విలువ సుమారు రూ. 40కోట్ల వరకు ఉంటుంది. ఇక  రూ.10 కోట్లతో టీటీడీ ఈ ఆలయ నిర్మాణం చేపట్టింది.  చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షులు శేఖర్ రెడ్డి, సభ్యులు స్మిత ఇతర సభ్యుల ఆధ్వర్యంలో రూ.5 కోట్లతో గాలిగోపురం, కలశాలు ఏర్పాటు చేశారు. (twitter)

    ఆర్టికల్ షేర్ చేయండి