తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Kashmir Snowfall: శ్రీనగర్‌లో దట్టంగా కురుస్తున్న మంచు.. హిమపాతం మధ్యే భారత్ జోడో యాత్ర ముగింపు: ఫొటోలు

Kashmir Snowfall: శ్రీనగర్‌లో దట్టంగా కురుస్తున్న మంచు.. హిమపాతం మధ్యే భారత్ జోడో యాత్ర ముగింపు: ఫొటోలు

30 January 2023, 16:29 IST

Kashmir Snowfall: కశ్మీర్‌లోని శ్రీనగర్‌ (Srinagar)లో మంచు విపరీతంగా కురుస్తోంది. మరోసారి హిమపాతం అధికమైంది. మంచు ఏకంగా వర్షంలా పడుతోంది. దీంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) నేతృత్వంలో నిర్వహించిన భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) ముగింపు కార్యక్రమం కూడా దట్టమైన హిమపాతం మధ్య జరిగింది. శ్రీనగర్‌లో హిమపాతానికి సంబంధించిన ఆకట్టుకునే ఫొటోలపై ఓ లుక్కేయండి.

Kashmir Snowfall: కశ్మీర్‌లోని శ్రీనగర్‌ (Srinagar)లో మంచు విపరీతంగా కురుస్తోంది. మరోసారి హిమపాతం అధికమైంది. మంచు ఏకంగా వర్షంలా పడుతోంది. దీంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) నేతృత్వంలో నిర్వహించిన భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) ముగింపు కార్యక్రమం కూడా దట్టమైన హిమపాతం మధ్య జరిగింది. శ్రీనగర్‌లో హిమపాతానికి సంబంధించిన ఆకట్టుకునే ఫొటోలపై ఓ లుక్కేయండి.
శ్రీనగర్‌లో ఆదివారం రాత్రి నుంచి మంచు విపరీతంగా కురుస్తోంది. దీంతో శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టు నుంచి అన్ని విమానాలు తాత్కాలికంగా రద్దయ్యాాయి. 
(1 / 6)
శ్రీనగర్‌లో ఆదివారం రాత్రి నుంచి మంచు విపరీతంగా కురుస్తోంది. దీంతో శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టు నుంచి అన్ని విమానాలు తాత్కాలికంగా రద్దయ్యాాయి. (PTI)
భారత్ జోడో యాత్ర ముగింపు కార్యక్రమం సోమవారం శ్రీనగర్‌లో హిమాపాతం మధ్యే జరిగింది. మంచు తీవ్రంగా కురుస్తున్న సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రసంగిస్తున్న దృశ్యమిది. కొందరు గొడుగులు కూడా పట్టుకున్నారు.
(2 / 6)
భారత్ జోడో యాత్ర ముగింపు కార్యక్రమం సోమవారం శ్రీనగర్‌లో హిమాపాతం మధ్యే జరిగింది. మంచు తీవ్రంగా కురుస్తున్న సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రసంగిస్తున్న దృశ్యమిది. కొందరు గొడుగులు కూడా పట్టుకున్నారు.(AFP)
శ్రీనగర్‌లోని రోడ్లపై మంచు విపరీతంగా పేరుకొని పోతోంది. దీంతో రవాణాకు కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
(3 / 6)
శ్రీనగర్‌లోని రోడ్లపై మంచు విపరీతంగా పేరుకొని పోతోంది. దీంతో రవాణాకు కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.(PTI)
రామ్‍బన్ జిల్లాలో మంచు చరియలు విరిగిపడటంతో జమ్ము-శ్రీనగర్ హైవేను మూసివేశారు అధికారులు. దీంతో రహదారులపై వందలాది వాహనాలు నిలిచిపోయాయి. 
(4 / 6)
రామ్‍బన్ జిల్లాలో మంచు చరియలు విరిగిపడటంతో జమ్ము-శ్రీనగర్ హైవేను మూసివేశారు అధికారులు. దీంతో రహదారులపై వందలాది వాహనాలు నిలిచిపోయాయి. (PTI)
శ్రీనగర్‌లోని ఇళ్లపై మంచు దుప్పటి కమ్మేసిన దృశ్యమిది. 
(5 / 6)
శ్రీనగర్‌లోని ఇళ్లపై మంచు దుప్పటి కమ్మేసిన దృశ్యమిది. (HT Photo/Waseem Andrabi)
శ్రీనగర్‌లో మరికొంతకాలం హిమపాతం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 
(6 / 6)
శ్రీనగర్‌లో మరికొంతకాలం హిమపాతం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. (HT Photo/Waseem Andrabi)

    ఆర్టికల్ షేర్ చేయండి