తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Cm Jagan Presented Silk Clothes To Tirumala Srivaru In Pics

Tirumala Brahmotsavam 2022 In Pics : శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

27 September 2022, 23:40 IST

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల శ్రీవారికి సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పించారు.

  • తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల శ్రీవారికి సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పించారు.
తిరుమల శ్రీవారికి సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీవారి దర్శన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్‌ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఇది నాలుగోసారి.
(1 / 13)
తిరుమల శ్రీవారికి సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీవారి దర్శన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్‌ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఇది నాలుగోసారి.
అంతుముందు తిరుపతి గ్రామ దేవత తాతయ్య గుంట గంగమ్మ అమ్మవారిని సీఎం జగన్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
(2 / 13)
అంతుముందు తిరుపతి గ్రామ దేవత తాతయ్య గుంట గంగమ్మ అమ్మవారిని సీఎం జగన్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు మంగ‌ళ‌వారం సాయంత్రం 5.45 నుండి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో వైభవంగా ప్రారంభమయ్యాయి.
(3 / 13)
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు మంగ‌ళ‌వారం సాయంత్రం 5.45 నుండి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో వైభవంగా ప్రారంభమయ్యాయి.
శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేశారు. సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారని ప్రాశస్త్యం.
(4 / 13)
శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేశారు. సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారని ప్రాశస్త్యం.
ముందుగా బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని, పరివార దేవతలైన శ్రీ అనంత, గరుడ, చక్రత్తాళ్వార్‌, సేనాధిపతి వారిని, ధ్వజపటాన్ని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.
(5 / 13)
ముందుగా బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని, పరివార దేవతలైన శ్రీ అనంత, గరుడ, చక్రత్తాళ్వార్‌, సేనాధిపతి వారిని, ధ్వజపటాన్ని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.
తొలిరోజైన మంగ‌ళ‌వారం ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వరస్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు సీఎం జగన్.
(6 / 13)
తొలిరోజైన మంగ‌ళ‌వారం ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వరస్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు సీఎం జగన్.
ముందుగా శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు సీఎం. అక్కడినుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు.
(7 / 13)
ముందుగా శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు సీఎం. అక్కడినుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు.
ముందుగా శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు సీఎం. అక్కడినుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు.
(8 / 13)
ముందుగా శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు సీఎం. అక్కడినుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు.
ఆ తరువాత ముఖ్యమంత్రి ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు.
(9 / 13)
ఆ తరువాత ముఖ్యమంత్రి ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు.
శ్రీవారి సేవలో సీఎం జగన్
(10 / 13)
శ్రీవారి సేవలో సీఎం జగన్
శ్రీవారి ప్రసాదం అందజేస్తున్న వైవీ సుబ్బారెడ్డి
(11 / 13)
శ్రీవారి ప్రసాదం అందజేస్తున్న వైవీ సుబ్బారెడ్డి
బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తులు
(12 / 13)
బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తులు
రంగనాయకుల మండపంలో వేదమంత్రోచ్ఛారణతో వేద పండితులు ఆశీర్వచనం
(13 / 13)
రంగనాయకుల మండపంలో వేదమంత్రోచ్ఛారణతో వేద పండితులు ఆశీర్వచనం

    ఆర్టికల్ షేర్ చేయండి