తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Northeast Monsoon : ఈశాన్య రుతుపవనాలు మరింత ఆలస్యం.. కారణం ఏంటంటే!

Northeast Monsoon : ఈశాన్య రుతుపవనాలు మరింత ఆలస్యం.. కారణం ఏంటంటే!

Sharath Chitturi HT Telugu

27 October 2023, 11:08 IST

    • Northeast Monsoon : ఈశాన్య రుతుపవనాల రాక ఆలస్యమవుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపానే ఇందుకు ప్రధాన కారణం.
ఈశాన్య రుతుపవనాలు మరింత ఆలస్యం..
ఈశాన్య రుతుపవనాలు మరింత ఆలస్యం.. (HT_PRINT)

ఈశాన్య రుతుపవనాలు మరింత ఆలస్యం..

Northeast Monsoon : సాధారణంగా అక్టోబర్​ మధ్య వారంలో దేశంలోకి ప్రవేశించాల్సిన ఈశాన్య రుతుపవనాలు.. ఈసారి ఆలస్యమయ్యాయి. అక్టోబర్ నెల​ ముగింపు దశకు చేరుకుంటున్నా.. ఇంకా రుతుపవనాల జాడ కనిపించడం లేదు. కాగా.. బంగాళాఖాతంలో ఇటీవలే ఏర్పడిన హమూన్తు​ పాను.. ఇందుకు కారణం అని వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే..

ట్రెండింగ్ వార్తలు

Rain alert : తెలంగాణ, ఆంధ్రలో మరో వారం రోజుల పాటు వర్షాలు- ఆ ప్రాంతాల్లో మాత్రం..

Woman muscular photo: కండలు తిరిగిన యువతిపై ట్రోలింగ్.. అబ్బాయిలకు దిమ్మతిరిగే జవాబు ఇచ్చిన కోచ్

Diabetes medicine price cut: గుండెజబ్బులు, డయాబెటిస్ మందుల ధరలను తగ్గించిన ప్రభుత్వం

Uber ride horror: కారులో ఉబర్ డ్రైవర్ హస్తప్రయోగం; భయాందోళనలకు గురైన మహిళ

ఈశాన్య రుతుపవనాలు..

నైరుతి రుతుపవనాలు.. సాధారణంగా.. ప్రతి యేటా జూన్​ మొదటి వారానికి అటు, ఇటుగా కేరళను తాకుతాయి. ఆ తర్వాత దేశాన్ని చుట్టి అక్టోబర్​ మొదటి వారం నాటికి వెళ్లిపోతాయి. ఆ తర్వాత.. అక్టోబర్​ 20కి అటు, ఇటుగా ఈశాన్య రుతుపవనాలు దేశంలోకి ప్రవేశిస్తాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్​ తీర ప్రాంతం, రాయలసీమ, మధ్య కర్ణాటక, కేరళను ఈ రుతుపవనాలు ప్రభావితం చేస్తాయి. తెలంగాణలో కూడా అక్కడక్కడ వర్షాలు పడతాయి.

Northeast Monsoon in India : కాగా.. బంగాళాఖాతంలో ఏర్పడిన హమూన్​ తుపాను కారణంగా.. ఈసారి ఈశాన్య రుతుపవనాలు ఆలస్యమయ్యాయని ప్రైవేట్​ వాతావరణ సంస్థ స్కైమెట్​ తెలిపింది.

"సాధారణంగా.. ఈ సమయంలో బంగాళాఖాతంలో తుపాను ఏర్పడదు. కానీ ఈసారి అలా జరిగింది. అందుకే.. అక్టోబర్​ 20కి అటు, ఇటుగా దేశంలోకి ప్రవేశించాల్సిన ఈశాన్య రుతుపవనాలు.. ఆలస్యమయ్యాయి. రుతుపవనాలు ఇంకాస్త ఆలస్యం అవ్వొచ్చు," అని స్కైమెట్​.. గురువారం తెలిపింది.

ఈ ఈశాన్య రుతుపవనాల ప్రభావం తొలుత తమిళనాడు, ఆంధ్రప్రదేశ్​పై ఉంటుంది. అక్టోబర్​ చివరి నాటికి ఈ రెండు చోట్ల భారీ వర్షాలు పడుతున్నట్టు కనిపిస్తే.. ఈశాన్య రుతుపవనాలు ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చినట్టే.

Northeast Monsoon time : ప్రస్తుతం పరిస్థితులు ప్రతికూలంగా ఉండటంతో.. స్కైమెట్​ అధికారులు రుతుపవనాలను నిరంతరం ట్రాక్​ చేస్తున్నట్టు సంస్థ తెలిపింది.

భారత వాతావరణశాఖ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. ఆంధ్రప్రదేశ్​లో వర్షాలు కనిపిస్తే.. ఆలస్యమైన ఈశాన్య రుతుపవనాలు, ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చినట్టు భావించవచ్చని పేర్కొంది.

ఈ ఏడాది.. సాధారణం కన్నా తక్కువే!

8ఏళ్లల్లో తొలిసారిగా.. ఈ ఏడాది.. ఇండియాలో వర్షపాతం, సాధారణం కన్నా తక్కువగా నమోదవుతుందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) వెల్లడించింది. జూన్​ 1 నుంచి సెప్టెంబర్​ 6 మధ్య ఉన్న నైరుతి రుతుపవనాల సీజన్​లో దేశంలో 11శాతం లోటు వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది.

తెలంగాణలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు..

TS winter updates : తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. పది రోజుల క్రితం రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదైనా మూడు నాలుగు రోజులుగా చలి వణికిస్తోంది. చలితీవ్రత నేపథ్యంలో ఉదయాన్నే లేవడానికి జనాలు భయపడుతున్నారు. ముఖ్యంగా పల్లెల్లో ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం