తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Delhi Robbery Case : నడిరోడ్డు మీద.. కళ్లల్లో కారం చల్లి- రూ. 45లక్షలు చోరీ..!

Delhi robbery case : నడిరోడ్డు మీద.. కళ్లల్లో కారం చల్లి- రూ. 45లక్షలు చోరీ..!

Sharath Chitturi HT Telugu

16 July 2022, 6:49 IST

    • Delhi robbery case : నడిరోడ్డు మీద ఇద్దరు వ్యక్తులు దోపిడీకి గురయ్యారు. బైక్​ మీద వచ్చిన కొందరు.. బాధితుల కళ్లల్లో కారం చల్లి, వారి వద్ద ఉన్న రూ. 45లక్షలను దోచుకెళ్లారు! ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.
నడిరోడ్డు మీద.. కళ్లల్లో కారం చల్లి- రూ. 45లక్షలు చోరీ..!
నడిరోడ్డు మీద.. కళ్లల్లో కారం చల్లి- రూ. 45లక్షలు చోరీ..! (HT Telugu)

నడిరోడ్డు మీద.. కళ్లల్లో కారం చల్లి- రూ. 45లక్షలు చోరీ..!

Delhi robbery case : దేశ రాజధాని ఢిల్లీలో నడిరోడ్డు మీద ఇద్దరు దోపిడీకి గురయ్యారు. నిందితులు.. బాధితుల కళ్లల్లో కారం చల్లి.. రూ. 45లక్షలు దోచుకెళ్లారు.

ట్రెండింగ్ వార్తలు

CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

CSIR UGC NET : సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు షురూ..

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

Brij Bhushan : బ్రిజ్​ భూషణ్​ కుమారుడికి బీజేపీ టికెట్​- రెజ్లర్ల స్పందన ఇది..

నడిరోడ్డు మీద..

ఢిల్లీలోని డిఫెన్స్​ కాలనీ ఫ్లైఓవర్​ మీద శుక్రవారం సాయంత్రం 6 గంటలకు జరిగింది ఈ ఘటన. బాధితులు అనిల్​ సింగ్​ యాదవ్​, చతర్​ సింగ్​లు.. స్థానికంగా లోన్లు ఇచ్చి డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. కాగా.. శుక్రవారం సాయంత్రం షాపింగ్​ మాల్స్​లు ఎక్కువగా ఉండే లజ్​పత్​ నగర్​ మార్కెట్​ నుంచి డబ్బులు వసూలు చేశారు. అక్కడి నుంచి చాంద్నీ చౌక్​కు ఆటోలో బయలుదేరారు. మార్గం మధ్యలో.. వారి ఆటోను రెండు బైక్​లు అడ్డుకున్నాయి. బైక్​ మీద ఉన్న నలుగురు.. ఆటో వద్దకు వచ్చి బాధితుల కళ్లల్లో కారం చల్లారు. నొప్పితో బాధితులు అరిచారు. ఈ క్రమంలోనే వారి వద్ద ఉన్న రూ. 45లక్షలను దోచుకుని అక్కడి నుంచి పరారైయ్యారు. కొన్ని క్షణాల్లోనే అంతా జరిగిపోయింది.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి పరుగులు తీశారు. బాధితుల ఇచ్చిన స్టేట్​మెంట్​ రాసుకున్నారు.

స్థానిక సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి, నిందితులను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.

టాపిక్