తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vikramarkudu Bollywood Sequel: విక్ర‌మార్కుడు సీక్వెల్‌లో ర‌ష్మిక మంద‌న్న - హీరో కూడా ఛేంజ్‌?

Vikramarkudu Bollywood Sequel: విక్ర‌మార్కుడు సీక్వెల్‌లో ర‌ష్మిక మంద‌న్న - హీరో కూడా ఛేంజ్‌?

HT Telugu Desk HT Telugu

01 June 2023, 14:40 IST

  • Vikramarkudu Bollywood Sequel: బాలీవుడ్‌లో ర‌ష్మిక మంద‌న్న మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ సొంతం చేసుకున్న‌ట్లు స‌మాచారం. విక్ర‌మార్కుడు హిందీ సీక్వెల్‌లో ర‌ష్మిక హీరోయిన్‌గా న‌టించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ర‌ష్మిక మంద‌న్న‌
ర‌ష్మిక మంద‌న్న‌

ర‌ష్మిక మంద‌న్న‌

Vikramarkudu Bollywood Sequel: దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి (Rajamouli) డైరెక్ష‌న్‌లో ర‌వితేజ హీరోగా తెర‌కెక్కిన విక్ర‌మార్కుడు టాలీవుడ్‌లో సెన్సేష‌న‌ల్ హిట్‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ హిందీలో రౌడీ రాథోడ్ పేరుతో రీమైకైంది. అక్ష‌య్ కుమార్ హీరోగా న‌టించిన ఈ రీమేక్ మూవీ 2012 ఏడాదిలో హ‌య్యెస్ట్ గ్రాసింగ్ బాలీవుడ్ మూవీగా నిలిచింది.

ట్రెండింగ్ వార్తలు

Hi Nanna: హాయ్ నాన్న సినిమాకు మరో అంతర్జాతీయ వేదికపై అవార్డుల పంట.. ఆరు పురస్కారాలు: ఏఏ విభాగాల్లో వచ్చాయంటే..

Samantha: ‘అది ఫేక్’: సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమంత ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..

Chitram Choodara OTT: నేరుగా ఓటీటీలోకి వస్తున్న వరుణ్ సందేశ్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Aditya Kapur Ananya Panday: బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆదిత్య కపూర్, అనన్య పాండే బ్రేకప్ చేసుకున్నారా? వివరాలివే

దాదాపు ప‌ద‌కొండేళ్ల విరామం త‌ర్వాత రౌడీ రాథోడ్‌కు సీక్వెల్‌ను తెర‌కెక్కించేందుకు స‌న్నాహాలు జ‌రుగుతోన్న‌ట్లు తెలిసింది. ఈ సీక్వెల్ లో అక్ష‌య్ కుమార్ స్థానంలో షాహిద్ క‌పూర్ హీరోగా న‌టించ‌బోతున్న‌ట్లు తెలిసింది.

హీరోగా ర‌ష్మిక మంద‌న్న‌(Rashmika Mandanna)ను ఫిక్స్ చేసిన‌ట్లు బాలీవుడ్‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ర‌ష్మిక కూడా ఈ సీక్వెల్ కోసం డేట్స్ కేటాయించిన‌ట్లు చెబుతోన్నారు. రౌడీ రాథోడ్ సినిమాకు ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

సీక్వెల్‌ను తెర‌కెక్కించే బాధ్య‌త‌ను అత‌డి స్థానంలో అనీస్ బ‌జ్మీ చేప‌ట్టిన‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం రౌడీ రాథోడ్ -2కు సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ మొత్తం పూర్త‌యిన‌ట్లు తెలిసింది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌నున్న ఈ సీక్వెల్‌కు బాలీవుడ్ అగ్ర ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

కాగా ప్ర‌స్తుతం ర‌ష్మిక మంద‌న్న బాలీవుడ్‌లో అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న యానిమ‌ల్ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ర‌ణ్‌భీర్‌క‌పూర్ హీరోగా న‌టిస్తోన్న ఈ మూవీ ఆగ‌స్ట్ 11న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. తెలుగులో అల్లు అర్జున్ పుష్ప -2తో (Pushpa 2) పాటు నితిన్ - వెంకీ కుడుముల కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న సినిమా చేస్తోంది ర‌ష్మిక మంద‌న్న‌.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.