తెలుగు న్యూస్  /  Entertainment  /  Balakrishna Veera Simha Reddy First Single Jai Balayya Mass Anthem Out Now

Veera Simha Reddy First Single: రాజ‌సం నీ ఇంటిపేరు, పౌరుషం నీ ఒంటి పేరు - వీర‌సింహారెడ్డి ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్‌

25 November 2022, 11:01 IST

  • Veera Simha Reddy First Single: బాల‌కృష్ణ వీర‌సింహారెడ్డి ఫ‌స్ట్ సింగిల్ రిలీజైంది. జై బాల‌య్య జైజై బాల‌య్య అనే లిరిక్స్‌తో సాగిన ఈ మాస్ సాంగ్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది.

బాల‌కృష్ణ
బాల‌కృష్ణ

బాల‌కృష్ణ

Veera Simha Reddy First Single: మాస్ సాంగ్‌తో అభిమానుల్లో జోష్ నింపారు బాల‌కృష్ణ‌. వీర‌సింహారెడ్డి ఫ‌స్ట్ సింగిల్‌ను శుక్ర‌వారం రిలీజ్ చేశారు. రాజ‌సం నీ ఇంటిపేరు, పౌరుషం నీ ఒంటి పేరు జై బాల‌య్య జైజై బాల‌య్య అంటూ సినిమాలో బాల‌కృష్ణ క్యారెక్ట‌రైజేష‌న్‌ను చాటిచెబుతూ ప‌వ‌ర్‌ఫుల్ లిరిక్స్‌తో ఈ పాట సాగింది. బాల‌కృష్ణ ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకొని మాస్ ట్యూన్స్‌తో ఈ పాట‌ను కంపోజ్ చేశారు సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్‌.

ట్రెండింగ్ వార్తలు

Karthika deepam 2: కార్తీకదీపం 2 సీరియల్.. దీప భర్త గురించి తెలుసుకున్న పారిజాతం.. నరసింహ చేసిన పనికి రగిలిపోయిన అనసూయ

NNS May 3rd Episode: అమరేంద్ర, అరుంధతి కథ సమాప్తం- ఉలిక్కిపడిన రామ్మూర్తి- మిస్సమ్మ జీవితంలో కొత్త అధ్యాయం- మనుకు ఏడుపు

Guardian OTT: ఓటీటీలోకి హ‌న్సిక హార‌ర్ మూవీ - తెలుగులోనూ స్ట్రీమింగ్‌

Andre Russel Hindi Song: బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మరో వెస్టిండీస్ క్రికెటర్.. హిందీ పాట పాడిన రసెల్

ఖ‌రీముల్లా ఆల‌పించారు. రామ‌జోగ‌య్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. ఫ‌స్ట్ సింగిల్‌తో ఈసినిమా ప్ర‌మోష‌న్స్ మొద‌లుపెట్టారు. వీర‌సింహారెడ్డి సినిమాకు గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. సంక్రాంతికి వీర‌సింహారెడ్డి రిలీజ్ కానుంది. ఇందులో బాల‌కృష్ణ డ్యూయ‌ల్ షేడ్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

సాల్ట్ పెప్ప‌ర్ తో పాటు స్టైలిష్ లుక్‌లో బాల‌కృష్ణ క‌నిపిస్తాడ‌ని చెబుతున్నారు. రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో ప‌వ‌ర్‌ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. బాల‌కృష్ణ‌, శృతిహాస‌న్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న తొలి సినిమా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.

ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. వీర‌సింహారెడ్డి సినిమాలో క‌న్న‌డ న‌టుడు దునియా విజ‌య్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర పోషిస్తోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న‌ది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.