తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Smartphone Brand : ఇండియాలో నెంబర్​.1 స్మార్ట్​ఫోన్​ బ్రాండ్​గా వివో! సామ్​సంగ్​ డౌన్​..

Smartphone brand : ఇండియాలో నెంబర్​.1 స్మార్ట్​ఫోన్​ బ్రాండ్​గా వివో! సామ్​సంగ్​ డౌన్​..

Sharath Chitturi HT Telugu

10 May 2024, 13:50 IST

  • Best smartphone brand in India : భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్ షిప్ మెంట్​.. గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. ఇక వివో అత్యధిక మార్కెట్ వాటాను పొందిందని నివేదికలు చెబుతున్నాయి.

ఇండియాలో నెంబర్​.1 స్మార్ట్​ఫోన్​ బ్రాండ్​గా వివో!
ఇండియాలో నెంబర్​.1 స్మార్ట్​ఫోన్​ బ్రాండ్​గా వివో! (Vivo)

ఇండియాలో నెంబర్​.1 స్మార్ట్​ఫోన్​ బ్రాండ్​గా వివో!

Vivo Smartphone brand in India : ఇండియా స్మార్ట్​ఫోన్​ మార్కెట్​కి సంబంధించిన ఓ నివేదిక ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఈ నివేదిక ప్రకారం.. 2024 జనవరి- మార్చ్​ త్రైమాసికంలో ఇండియా స్మార్ట్​ఫోన్​ బ్రాండ్స్​లో వివో సంస్థ నెంబర్​.1 పొజిషన్​ తీసుకుంది. సామ్​సంగ్​ 3వ స్థానానికి పడిపోయింది. అంతేకాదు..  ఈ త్రైమాసికంలో మొత్తం స్మార్టఫోన్​ షిప్​మెంట్​ 8శాతం (ఇయర్​ ఆన్​ ఇయర్​) వృద్ధిని సాధించగా.. మొత్తం వాల్యూ పరంగా 18శాతం వృద్ధి నమోదైంది. మార్కెట్​ షేరు విషయంలో.. షావోమీ, సామ్​సంగ్​ని వివో వెనక్కి నెట్టేసింది.

వివో భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందింది

న్యూ కౌంటర్ పాయింట్ నివేదిక ప్రకారం.. వివో మొదటిసారి భారతదేశంలో 19.5 శాతం వాల్యూమ్ వాటాను నమోదు చేసింది. ఇది సామ్​సంగ్​ కంటే ఎక్కువ! 5జీ లీడర్షిప్, సీఎంఎఫ్ (కలర్, మెటీరియల్, ఫినిషింగ్) పొజిషనింగ్​తో పాటు బలమైన ఇమేజింగ్ సామర్థ్యాల కారణంగా ఈ త్రైమాసికంలో చైనా కంపెనీ మార్కెట్ వాటా పెరిగిందని రీసెర్చ్ అనలిస్ట్ శుభమ్ సింగ్ తెలిపారు.

ఈ నివేదికలో సామ్​సంగ్​ 17.5 శాతం వాటాతో షియోమీ కంటే దిగువన, మూడో స్థానంలో నిలిచింది. అయితే ప్రీమియం మార్కెట్ సెగ్మెంట్​లో మాత్రం సామ్​సంగ్​ ఆధిపత్యం చెలాయించింది. భారతదేశంలో, సామ్​సంగ్​ సేల్​ ప్రైజ్​ 425 డాలర్లుగా ఉంది. ఇది భారతదేశంలో విక్రయించే తన స్మార్ట్​ఫోన్​కు కంపెనీ సాధించిన అత్యధిక సగటు ధర.

భారత్​లో ప్రీమియం స్మార్ట్​ఫోన్ల మార్కెట్ వాటా..

Samsung smartphones market share in India : మరోవైపు తాజా ఐఫోన్ 15 సిరీస్ కారణంగా ప్రీమియం మార్కెట్​లో యాపిల్ కూడా భారత్​లో రికార్డు స్థాయి వాటాను నమోదు చేసింది. దేశంలో ప్రీమియం స్మార్ట్​ఫోన్​లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. సైబర్​మీడియా రీసెర్చ్ (సీఎంఆర్) నివేదిక ప్రకారం 2024 క్యూ1లో స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లో యాపిల్ 6 శాతం మార్కెట్ వాటాను అందుకుంది. ఐఫోన్ 15 సిరీస్​కు పెరుగుతున్న డిమాండ్ దాని మొత్తం ఎగుమతుల్లో 60 శాతానికి దోహదపడుతోంది!

ఇప్పుడు మిడ్ రేంజ్, ప్రీమియం విభాగంలో అనేక స్మార్ట్​ఫోన్ లాంచ్​లతో కొత్త త్రైమాసికం ప్రారంభమైంది. అదనంగా, ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో సామ్​సంగ్​, యాపిల్ వంటి స్మార్ట్​ఫోన్​ సంస్థలు వరుసగా మోడల్స్​ని లాంచ్​ చేయనున్నాయి. వాటిపై చాలా ఆశలు కలిగి ఉన్నాయి. అందుకే 2024 రెండో భాగం ఆయా కంపెనీలకు మరింత కీలకంగా మారనున్నాయి. కౌంటర్ పాయింట్ నివేదిక కూడా 2024 లో భారత స్మార్ట్​ఫోన్​ మార్కెట్ సింగిల్ డిజిట్​లో వృద్ధి చెందుతుందని అంచనా వేసింది.

ఇంకో విషయం! మనం ఇప్పుడు వాట్సప్ ఛానల్స్ లో ఉన్నాం! టెక్నాలజీ ప్రపంచం నుంచి లేటెస్ట్​ అప్డేట్స్​ కోసం హెచ్​టీ తెలుగు వాట్సాప్​ ఛానెల్​ని ఫాలో అవ్వడం మర్చిపోకండి.

తదుపరి వ్యాసం