తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ekagrah Murty : 5 నెలల పసికందు.. సంపద రూ. 4 కోట్లు- తాత వల్లే ఇదంతా!

Ekagrah Murty : 5 నెలల పసికందు.. సంపద రూ. 4 కోట్లు- తాత వల్లే ఇదంతా!

Sharath Chitturi HT Telugu

19 April 2024, 13:59 IST

  • Ekagrah Murthy Infosys : నారాయణ మూర్తి మనవడు ఏకాగ్రహ్​ మూర్తి వయస్సు 5 నెలలు. కానీ ఈ పసికందు.. ఇప్పుడు రూ. 4కోట్లు సంపాదించాడు! అది ఎలా అంటే..

ఇన్ఫోసిస్​ ఫౌండర్​ నారాయణ మూర్తి..
ఇన్ఫోసిస్​ ఫౌండర్​ నారాయణ మూర్తి.. (PTI)

ఇన్ఫోసిస్​ ఫౌండర్​ నారాయణ మూర్తి..

Ekagrah Murthy net worth : ఎఫ్​వై24 క్యూ4 ఫలితాలను తాజాగా వెల్లడించింది దిగ్గజ టెక్​ సంస్థ ఇన్ఫోసిస్​. రిజల్ట్స్​తో పాటు రూ. 28 విలువ చేసే డివిడెండ్​ని కూడా ప్రకటించింది. ఈ వార్తల మధ్య.. ఇన్ఫోసిస్​ ఫౌండర్​ నారాయణ మూర్తి మనవడు ఏకాగ్రహ్​ రోహన్​ మూర్తి ఇప్పుడు హాట్​ టాపిక్​గా మారాడు. ఈ 5 నెలల పసికందు.. సంపద రూ. 4కోట్లు! ఇదెలా సాధ్యమైదంటే..

ట్రెండింగ్ వార్తలు

Tata Nexon SUV : టాటా నెక్సాన్​లో కొత్త ఎంట్రీ లెవల్​ వేరియంట్లు.. భారీగా దిగొచ్చిన ఎస్​యూవీ ధర!

Gold price today : స్థిరంగా పసిడి ధరలు- తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఇలా..

Tata Motors Q4 Results: క్యూ 4 లో దూసుకుపోయిన టాటా మోటార్స్; నికరలాభంలో 222% వృద్ధి

Phone hack: మీ స్మార్ట్ ఫోన్ హ్యాక్ అయిందో లేదో.. ఇలా తెలుసుకోండి..

నారాయణ మూర్తి గిఫ్ట్​..

నారాయణ మూర్తి కుమారుడు రోహన్​ మూర్తి తనయుడు.. ఈ ఏకాగ్రహ్​ మూర్తి. గతేడాది నవంబర్​లో జన్మించాడు. ఆ పసికందుకు.. ఇన్ఫోసిస్​కి చెందిన 15లక్షల షేర్లను ఇటీవలే గిఫ్ట్​గా ఇచ్చారు నారాయణ మూర్తి. అంటే సంస్థలో 0.04శాతం వాటా! ఈ షేర్ల విలువ సుమారు రూ. 200 కోట్లు ఉంటుంది.

ఇక.. ఇన్ఫోసిస్​ ఫలితాలను ప్రకటించినప్పుడే.. రూ. 20 డివిడెండ్​ని ఇస్తున్నట్టు పేర్కొంది సంస్థ. అంతేకాకుండా.. రూ. 8 స్పెషల్​ డివిడెండ్​ని కూడా ఇస్తున్నట్టు ప్రకటిచింది. ఫలితంగా.. మొత్తం డివిడెండ్​ రూ. 28కి చేరింది. జులై 1న పేమెంట్​ జరుగుతుందని చెప్పింది. ఇన్ఫోసిస్​ ప్రకటించిన డివిడెండ్లతోనే.. 5 నెలల ఏకాగ్రహ్​ మూర్తి దాదాపు రూ. 4.2 కోట్లు సంపాదించినట్టు అవుతుంది!

Ekagrah Murthy Narayan Murthy : ఈ వార్త విన్నవారందరు షాక్​ అవుతున్నారు. 'మా తాత ఆస్తులు అమ్మేశాడు. నారాయణ మూర్తి.. తన మనవడికి ఖరీదైన గిఫ్ట్​ ఇచ్చాడు,' అంటూ కామెంట్లు చేస్తున్నారు.

నారాయణ మూర్తి- సుధా మూర్తికి ఇద్దరు పిల్లలు. వారు.. రోహన్​ మూర్తి, అక్షతా మూర్తి (బ్రిటన్​ ప్రధాని రిషి సునక్​ భార్య). ఇక నారాయణ మూర్తి- సుధా మూర్తిలకు ఇద్దరు మనవళ్లు, ఒక మనవరాలు ఉన్నారు. వారి పేర్లు.. కృష్ణ, ఏకాగ్రహ్​, అనౌష్క.

డిసెంబర్​తో ముగిసిన త్రైమాసికం నాటికి.. అక్షతా మూర్తి దగ్గర 1.05శాతం ఇన్ఫోసిస్​ వాటా ఉంది. సుధా మూర్తి దగ్గర 0.93శాతం, రోహన్​ మూర్తి దగ్గర 1.64శాతం వాటాలు ఉన్నాయి. ఇన్ఫోసిస్​లో నారాయణ మూర్తి వాటా 0.04శాతం కన్నా తక్కువే!

ఇన్ఫోసిస్​ షేర్​ ప్రైజ్​..

Infosys share price target : ఇన్పోసిస్​ ఫలితాలు.. మార్కెట్​ అంచనాలను పూర్తిగా నిరాశపరిచాయి. ఫలితంగా.. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఇన్ఫోసిస్​ స్టాక్​.. భారీ నష్టాలతో ఓపెన్​ అయ్యింది. కానీ ఆ తర్వాత కాస్త కోలుకుని.. మధ్యాహ్నం 1:45 సమయానికి 1శాతం నష్టంతో రూ. 1411 వద్ద ట్రేడ్​ అవుతోంది ఇన్ఫోసిస్​ షేరు.

తదుపరి వ్యాసం