తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Extra Marital Affair : ప్రియుడిని రమ్మని పిలిచింది.. తర్వాత దారుణం జరిగిపోయింది

Extra Marital Affair : ప్రియుడిని రమ్మని పిలిచింది.. తర్వాత దారుణం జరిగిపోయింది

HT Telugu Desk HT Telugu

28 November 2022, 23:18 IST

    • Extra Marital Affair In Nellore : నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఎవరూ లేని ప్రదేశానికి రమ్మని ప్రియుడికి కబురు పంపింది. తీరా వెళ్లాక దారుణం జరిగింది.
ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు
ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు

ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు

వివాహేతర సంబంధాలతో దారుణాలు జరిగిపోతున్నాయి.. ప్రాణాలు పోతున్నాయి. ఆ తర్వాత కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయి. తాజాగా నెల్లూరు(Nellore) జిల్లా సీతారామపురంలోనూ వివాహేతర సంబంధం ఓ ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎవరూ లేని ప్రదేశానికి ప్రియుడిని.. రమ్మని చెప్పి.. హత్య చేసి మృతదేహాన్ని కాల్చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ట్రెండింగ్ వార్తలు

AP POLYCET Results 2024 : ఇవాళ ఏపీ పాలిసెట్ 'ఫైనల్ కీ' - ఫలితాలు ఎప్పుడంటే..?

AP Weather : రేపు 30 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మంగళవారం భారీ వర్షాలు

Coringa Wildlife Sanctuary : మడ అడవుల్లో బోటింగ్, ప్రకృతి అద్భుతాలు- ఈ సమ్మర్ లో కోరింగ అందాలు చూసేయండి!

Bezawada Caste Politics: బెజవాడలో అంతే, తలచుకుంటే రైల్వే లైన్లు కూడా తీయిస్తారు, కులం కోసమే ఏమైనా చేస్తారు..

కడప(Kadapa) జిల్లా పోరుమామిళ్లకి చెందిన మహిళ మెుహరున్నీసాకు కాశినాయన మండలం కొండ్రాజుపల్లికి చెందిన సుబ్బారావుతో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. అయితే ఇటీవలే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. అలానే గొడవలు నడుస్తున్నాయి. మృతుడిని ఆదివారం అర్ధరాత్రి సీతారామపురం(Sitaramapuram) రమ్మని చెప్పింది ప్రియురాలు. ఆమె పిలిచింది కదా అని ప్రియుడు వెళ్లాడు.

సీతారామపురంలోని ఆదర్శ పాఠశాల(School) సమీపంలోని ఓ నివాసం వద్దకు రావాలని కోరింది. సరేనని ప్రియుడు వెళ్లాడు. అప్పటికే ప్రియుడిని చంపేయాలని ప్లాన్ వేసుకుంది. ఎవరూ లేని ప్రదేశాని తీసుకెళ్లింది. అతి కిరాతకంగా నరికి.. పెట్రోల్ తో స్కూటర్ పై మృతదేహాన్ని పెట్టి కాల్చేసింది. ఇక అక్కడ నుంచి బయలుదేరి వెళ్లిపోయింది.

హత్య జరిగిన వెంటనే.. నేరుగా కడప జిల్లా పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్(Police Station)కు వెళ్లి లొంగిపోయింది మెుహరున్నీసా. పోలీసు(Police)ల ఎదుట నేరాన్ని అంగీకరించింది. అక్కడి పోలీసులు నెల్లూరు(Nellore) జిల్లా సీతారామపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు పోలీసులు. కేసు నమోదు చేసి నిందితురాలని విచారిస్తున్నారు.

సుబ్బారావు కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవాడని తెలుస్తోంది. ఆ సమయంలోనే పోరుమామిళ్లకు చెందిన మెుహరున్నీసాతో పరిచం ఏర్పడింది. ఇటీవలే మెుహరున్నీసా నెల్లూరు జిల్లా సీతారామపురంలో ఇల్లు నిర్మించుకుని ఉంటోంది. ఆర్థికంగా సుబ్బారావు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. గొడవలు ఎక్కువ కావడంతో ఇందులో భాగంగానే.. సుబ్బారావును మెుహరున్నీసా సీతారామపురం పిలిపించినట్టుగా తెలుస్తోంది. మృతుడికి భార్య, ఐదు ఏళ్లలోపు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.

ప్రియురాలు మాత్రమే హత్య చేసిందా? ఇంకా ఎవరైనా ఇందులో ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.