Nara Lokesh fire on ysrcp govt | సంతకాలు లేకుండా చీకటి ఎంవోయూలు
06 March 2023, 19:20 IST
- వైసీపీ ప్రభుత్వం విశాఖలో నిర్వహించిన గ్లోబర్ ఇన్వెస్టిమెంట్ సమ్మిట్ పై తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్ తీవ్ర ఆరోపణలు చేశారు. విశాఖలో నిర్వహించింది గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ కాదు, ముమ్మాటికి లోకల్ ఫేక్ సమ్మిట్. సంతకాలు, పత్రాలు, పేర్లు లేకుండా చీకటి ఎంవోయూలు చేసుకున్నారని లోకేశ్ అన్నారు. తమ ప్రభుత్వ హాయంలో కూడా ఇలాంటి సమ్మిట్ నిర్వహించామని, పూర్తిగా పారదర్శకంగా జరిగిందన్నారు. పలు కంపెనీల్లో పులివెందలకు చెందిన వారున్నారని, ఇవన్నీ ఫేక్ కంపెనీలని లోకేశ్ ధ్వజమెత్తారు.