తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Jagan Vizag Tour : సీఎం జగన్ విశాఖ టూర్ షెడ్యూల్ ఇదే

CM Jagan Vizag Tour : సీఎం జగన్ విశాఖ టూర్ షెడ్యూల్ ఇదే

HT Telugu Desk HT Telugu

10 November 2022, 16:11 IST

    • CM Jagan Visakhapatnam Tour Schedule : ప్రధాని మోదీ విశాఖ పర్యటన ఉండనుంది. ఈ నేపథ్యంలో ఆయనతో కలిసి సీఎం జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
ఏపీ సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ (twitter)

ఏపీ సీఎం జగన్

సీఎం జగన్(CM Jagan) నవంబర్ 11, 12వ తేదీల్లో విశాఖలో పర్యటిస్తారు. పీఎం మోదీ(PM Modi)తో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుక్రవారం సాయంత్రం 6.15 గంటలకు జగన్ విశాఖ వెళ్తారు. 6.35 గంటలకు ఐఎన్ఎస్(INS) డేగా చేరుకుని ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలుకుతారు. రాత్రికి పోర్ట్‌ గెస్ట్‌హౌస్‌(Port Guest House)లో బస చేస్తారు. శనివారం ఉదయం ఏయూ గ్రౌండ్(AU Ground)కు 10.05 గంటలకు చేరుకుంటారు. 10.30 నుంచి 11.45 గంటల వరకు మోదీతో కలిసి శంకుస్థాపనలు, ప్రాజెక్టు ప్రారంభోత్సవాల్లో ఉంటారు. మధ్యాహ్నం 12.20 గంటలకు ఐఎన్‌ఎస్‌ డేగాకు చేరుకుని మోదీకి వీడ్కోలు చెబుతారు. 12.45 గంటలకు విశాఖ విమానాశ్రయం నుంచి గన్నవరం బయలుదేరుతారు. మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు.

ట్రెండింగ్ వార్తలు

AP POLYCET Results 2024 : ఇవాళ ఏపీ పాలిసెట్ 'ఫైనల్ కీ' - ఫలితాలు ఎప్పుడంటే..?

AP Weather : రేపు 30 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మంగళవారం భారీ వర్షాలు

Coringa Wildlife Sanctuary : మడ అడవుల్లో బోటింగ్, ప్రకృతి అద్భుతాలు- ఈ సమ్మర్ లో కోరింగ అందాలు చూసేయండి!

Bezawada Caste Politics: బెజవాడలో అంతే, తలచుకుంటే రైల్వే లైన్లు కూడా తీయిస్తారు, కులం కోసమే ఏమైనా చేస్తారు..

మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ 11వ తేదీన సాయంత్రం 6.30 గంటలకు విశాఖ(Visakha) చేరుకుంటారు. ఎయిర్ పోర్ట్(Airport) నుంచి రోడ్డు మార్గంలో తూర్పు నౌకాదళం చేరుకుంటారు. చోళ సూట్‌లో బస చేస్తారు. శనివారం ఉదయం 10.30 గంటలకు ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలోని బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత 10 వేల 472 కోట్ల రూపాయల విలువైన 5 ప్రాజెక్టులకు శంకు స్థాపనలు, రెండు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేస్తారు.

నవంబర్ 11, 12 వ తేదీల్లో విశాఖపట్నం(Visakhapatnam)లో ప్రధాని మోదీ, సీఎం జగన్ పర్యటన(PM Modi Tour) ఉంది. ఈ మేరకు ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. నవంబర్ 13 వరకు 'నో ఫ్లై జోన్'(No Fly Zone) పరిధిలోకి వచ్చే ప్రాంతాలు ఎక్కువగా ఆంధ్రాయూనివర్సిటీ పరిధిలో ఉన్నాయి. AU ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ఉదయం 10.30 గంటల నుండి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. వేదిక నుండి ఐదు కిలోమీటర్ల పరిధిలో నో ఫ్లై జోన్ ఉంది.

UAV లేదా డ్రోన్‌లతో సహా ఏదైనా విమానయాన పరికరాలను పైన పేర్కొన్న ప్రాంతాలలో ఈ కాలంలో ఎగరడం నిషేధించారు. హెలిప్యాడ్(Helipad) వద్ద భద్రతా ఏర్పాట్లలో భాగంగా పోలీసుల ట్రయల్ రన్ నిర్వహించారు. ప్రత్యేక రక్షణ బృందం (ఎస్పీజీ) బృందం సమావేశ స్థలాన్ని సందర్శించింది. జెడ్‌ ప్లస్‌ కేటగిరీ వీవీఐపీ సందర్శన కోసం ఇక్కడికి వచ్చారు.

సభ జరిగే ప్రదేశానికి వెళ్లే వివిధ జంక్షన్లలో దాదాపు 7000 మంది ఏపీ పోలీసుల(AP Police)ను మోహరించారు. శివాజీ పార్క్ రోడ్డులో ఉన్నటువంటి స్థానిక కళ్యాణ మండపాలను పోలీసులకు బస, బోర్డింగ్ సౌకర్యాల కోసం ప్రభుత్వం అద్దెకు తీసుకుంది. డీజీపీ రాజేంద్రనాథ్ గురువారం రానున్నారు. అన్ని కీలక పాయింట్ల వద్ద మూడు రోజుల పాటు డాగ్ స్క్వాడ్‌లను మోహరించనున్నారు. బహిరంగ సభ వేదిక వద్ద 700 మంది ఎస్‌ఐలు, 350 మంది సీఐలు, 150 మంది డీఎస్పీలు విధులు నిర్వహిస్తారు.