RCB playoffs scenario IPL 2024 : ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కష్టాలు కొనసాగుతున్నాయి. ఆదివారం.. కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన ఉత్కంఠ పోరులో కూడా విరాట్ కోహ్లీ టీమ్ ఓడిపోయింది. ఫలితంగా.. ఈ ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచుల్లో 7సార్లు ఓటమి పాలైంది. ఇక ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ రేసులో ఆర్సీబీ దాదాపు ఎగ్జిట్ ఇచ్చినట్టేనా? అని అడిగితే మాత్రం.. ఇంకా అవకాశం ఉందనే చెప్పుకోవాలి. అది ఎలా అంటే..
ఇందాక చెప్పినట్టు.. ఈ ఐపీఎల్ 2024లో ఆర్సీబీ ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడింది. అందులో ఒక్కటంటే ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచి.. 2 పాయింట్స సంపాదించుకుని, పాయింట్స్ టేబుల్లో చివరి స్థానంలో నిలిచింది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ నెట్ రన్ రేట్ -1.046గా ఉంది. చెత్త ప్రదర్శనతో ఆర్సీబీ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. కానీ.. ఆర్సీబీ ప్లేఆఫ్స్కి చేరే అవకాశం ఇంకా ఉంది. కానీ అది ఆర్సీబీ చేతుల్లో లేదు!
RCB IPL 2024 : ఐపీఎల్ 2024లో ఆర్సీబీకి ఇంకా 6 మ్యాచ్లు ఉన్నాయి. వాటన్నింటిలో గెలిస్తే.. ఆర్సీబీకి 14 పాయింట్లు వస్తాయి. సాధారణంగా.. ఒక జట్టు ప్లేఆఫ్స్కి వెళ్లాలంటే 16 పాయింట్లు ఉండాలి. కానీ కొన్నికొన్ని సార్లు.. 14 పాయింట్లతో కూడా ప్లేఆఫ్స్కి చేరుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ దాని కోసం.. ఇతర జట్ల ప్రదర్శన, నెట్ రన్రేట్ పై అధికంగా ఆధారపడాల్సి ఉంటుంది.
అంటే.. ఐపీఎల్ 2024లో ఆర్సీబీ ప్లేఆఫ్స్ అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నా.. అది చాలా కష్ట. ముందు కోహ్లీ టీమ్ మిగిలిన 6 మ్యాచుల్లో కచ్చితంగా గెలవాలి. తమకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడాలని ప్రార్థనలు చేయాలి. అంతే! అలా జరగకుండా.. ఇంకొక్క మ్యాచ్ ఓడిపోయినా.. ఆర్సీబీ ప్లేఆఫ్స్ నుంచి ఔట్ అయినట్టే.
Virat Kohli out today match video : ఆర్సీబీ తదుపరి మ్యాచ్.. పటిష్ఠ సన్రైజర్స్ హైదరాబాద్తో జరగనుంది. ఏప్రిల్ 25 సాయంత్రం 7:30 గంటలకు ఉప్పల్ వేదికగా మ్యాచ్ మొదలవుతుంది.
ఇక ఆదివారం జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. కోల్కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో బెంగళూరు ఓటమి పాలైంది. ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో ఆర్సీబీ పరాజయం చెందింది.
KKR vs RCB IPL 2024 : ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 222 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఫిల్ సాల్ట్ (14 బంతుల్లో 48 పరుగులు; 7 ఫోర్లు, 3 సిక్స్లు) మెరుపులు మెరిపించగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (50) హాఫ్ సెంచరీ చేశాడు. చివర్లో రమణ్దీప్ సింగ్ (9 బంతుల్లో 24 పరుగులు నాటౌట్) దూకుడుగా ఆడాడు. బెంగళూరు బౌలర్లలో యశ్ దయాల్, కామెరూన్ గ్రీన్ తలా రెండు వికెట్లు తీశారు. మహమ్మద్ సిరాజ్, లూకీ ఫెర్గ్యూసన్ చెరో వికెట్ తీసుకున్నారు.
సంబంధిత కథనం