YS Avinash Reddy: నన్ను, నా కుటుంబాన్ని నాశనం చేయాలని రెండేళ్లుగా కుట్ర - చంద్రబాబు, సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు-ycp mp ys avinash reddy fires on chandrababu comments ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Avinash Reddy: నన్ను, నా కుటుంబాన్ని నాశనం చేయాలని రెండేళ్లుగా కుట్ర - చంద్రబాబు, సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు

YS Avinash Reddy: నన్ను, నా కుటుంబాన్ని నాశనం చేయాలని రెండేళ్లుగా కుట్ర - చంద్రబాబు, సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 03, 2023 04:37 PM IST

YS Avinash Reddy On Chandrababu: టీటీడీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు మాటలన్నీ పచ్చి అబద్ధాలన్నారు. 14 సంవత్సరాలుగా సీఎంగా ఉన్న వ్యక్తి పులివెందులకు ఏం చేశారని ప్రశ్నించారు.

ఎంపీ అవినాశ్ రెడ్డి
ఎంపీ అవినాశ్ రెడ్డి

YCP MP YS Avinash Reddy : పులివెందులలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడిన వ్యాఖ్యలను ఎంపీ అవినాష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.... వైఎస్ వివేకాహత్య కేసులో తనను, తన కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని చంద్రబాబు, వివేకా కూతురు సునీత రెడ్డితో పాటు... కొందరు టీటీడీ నేతలు రెండేళ్లుగా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తమ కుటుంబంపై కుట్రలు చేసి పార్టీకి ఆపాదించాలని చూస్తున్నారని విమర్శించారు.

పులివెందుల ప్రాంతాన్ని జగన్ రెడ్డి అన్నిరకాలుగా అభివృద్ది చేస్తుంటే చంద్రబాబు పులివెందులకు అన్ని నిధులు అవసరమా అని అంటున్నారన్నాని చెప్పారు. పులివెందులకు ఆదిత్య బిర్లా, అడిదాస్ లాంటి ఇండస్ట్రీలను తీసుకొచ్చారని అవినాష్ రెడ్డి గుర్తు చేశారు. 14 సంవత్సరాలుగా సీఎంగా ఉన్న వ్యక్తి పులివెందులకు ఏం చేశారని ప్రశ్నించారు. కుప్పానికి రెవెన్యూ డివిజన్ ఇచ్చి, కెనాల్స్ అన్నీ రెడీ చేస్తున్నారన్నారు. చంద్రబాబు ఆరోగ్య శ్రీ, ఫీజు రీయంబర్స్‌మెంట్‌ను పూర్తిగా నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. డ్వాక్రా మహిళలను మోసం చేశారని, రైతులకు వెన్నుపోటు పొడిచారని అన్నారు.

కరోనాలో రైతుల నుంచి అరటి, చినీ సేకరించి వారికి మద్దతు ధర ఇచ్చామన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. పైడిపాలెం ప్రాజెక్టు వ్యయం 690 కోట్ల అయితే వైయస్సార్ ఉన్నప్పుడే 650 కోట్లు ఖర్చు పెట్టారని ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కేవలం 40 కోట్లు ఖర్చుపెట్టి అంతా తామే చేసినట్లు చెబుతున్నారన్నారు. పైడిపాలెంలో మోటార్ల కొనుగోలు నుంచి పైప్ లైన్ల నిర్మాణం వరకూ ప్రతి ఒక్కటి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే పూర్తయ్యాయని అవినాష్ రెడ్డి తెలిపారు.

రాష్ట్రంలో ఆర్టీసీ బస్టాండ్‌ల అభివృద్ధికి సీఎం జగన్‌ సర్కార్‌ అడుగులు వేస్తోందని చెప్పారు. పులివెందుల బస్టాండ్‌ నిర్మాణ పనులకు ఆర్టీసీ ఛైర్మన్‌ మల్లికార్జునరెడ్డితో కలిసి ఎంపీ అవినాష్‌రెడ్డి గురువారం భూమిపూజ చేశారు. అనంతరం అవినాష్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులపై బాబు మాటలన్నీ పచ్చి అబద్ధాలే అని చెప్పారు. ఏది మాట్లాడిన ప్రజలు నమ్మేస్తారు అన్న ధోరణితోనే చంద్రబాబు పులివెందులలో ప్రసంగించారని... సాగునీటి ప్రాజెక్టులను నిర్మించిన ఘనత వైఎస్‌కే దక్కుతుందని స్పష్టం చేశారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం