భక్తులకు టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ అక్టోబర్ నెలలో శ్రీవారి ఆలయంలో నిర్వహించే విశేష పర్వదినాలను ప్రకటించింది. ఈ మేరకు పూర్తి వివరాలను వెల్లడించింది. అక్టోబర్ 3వ తేదీన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని పేర్కొంది. అక్టోబరు 4న ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇక అక్టోబరు 31న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం జరగనుంది.
• అక్టోబరు 2: మహాలయ అమావాస్య
• 3న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.
• అక్టోబరు 4న ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.
• అక్టోబరు 8న శ్రీవారి గరుడసేవ.
• అక్టోబరు 9న శ్రీవారి స్వర్ణరథోత్సవం.
• అక్టోబరు 11న రథోత్సవం.
• అక్టోబరు 12న శ్రీవారి చక్రస్నానం, ధ్వజావరోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు సమాప్తి.
• అక్టోబరు 13న శ్రీవారి బాగ్ సవారి ఉత్సవం.
• అక్టోబరు 28న సర్వ ఏకాదశి.
• అక్టోబరు 31న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం
ఇక 9 రోజులపాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అక్టోబర్ 4 నుంచి 12 వరకు వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు సిద్ధం చేసింది. రేపు 3న అంకురార్పణతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి.
ప్రతి రోజు ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య, సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల మధ్య (అక్టోబర్ 4 మినహా) వాహన సేవలు ఉంటాయి. రోజు వారీగా ఉదయం, సాయంత్రం వాహన సేవల షెడ్యూల్ ఈ విధంగా ఉంటుంది.
ఇక అక్టోబర్ 12వ తేదీన చక్నస్నానం ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి ఉదయం 9 గంటల ఈ క్రతువు జరుగుతుంది. ఇక అదే రోజు రాత్రి 8:30 గంటల నుంచి 10:30 గంటల వరకు ధ్వజావరోహణం నిర్వహిస్తారు. దీంతో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.