AP IPS Transfers : ఏపీలో అధికారులు బదిలీలు కొనసాగుతున్నాయి. తాజాగా 37 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. పలు జిల్లాల ఎస్పీలను బదిలీ చేశారు.
జీఆర్ రాధిక, డి. మేరీ ప్రశాంతి, ఆరిఫ్ హఫీజ్, కె. రఘువీరా రెడ్డి, సిద్ధార్థ్ కౌశల్, గరుడ్ సుమిత్ సునీల్, పి. జగదీష్, ఎస్ శ్రీధర్, ఎం. సత్తిబాబు ఐపీఎస్ అధికారులను తదుపరి పోస్టింగ్ కోసం డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని సీఎస్ ఆదేశించారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం శాఖల వారీగా ప్రక్షాళన చేస్తుంది. ఇటీవల పలువురు ఐపీఎస్ లను బదిలీ చేసింది. విజయవాడ సీపీగా రాజశేఖరబాబు నియమించింది. లా అండ్ అర్డర్ ఐజీగా శ్రీకాంత్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఫైర్ సర్వీసెస్ డీజీగా పైదిరెడ్డి ప్రతాప్ ని నియమించారు. మరికొందరు అధికారులను డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.
సంబంధిత కథనం